www.ntodaynews.com
రాగానిపల్లిలో విషాదం చింతచెట్టుకు ఉరివేసుకుని వృద్ధుడి మృతి అనుమానం
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
అన్నమయ్య జిల్లా పుంగనూరు , జూన్ - 10 రాగానిపల్లికి చెందిన గంగిరెడ్డి కుమారుడు ఎమ్. ప్రభాకర్ రెడ్డి (65) చింతమానుకు ఉరివేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య ఎమ్. రెడ్డెమ్మ, భాను ప్రకాష్ (కుమారుడు), రాధ(కుమార్తె) కలరు. మృతుడి ఆత్మహత్యకు గల కారణం ఇంకా తెలియరాలేదని గ్రామస్థులు తెలిపారు. ఈ సంఘటనపై గ్రామస్థులు పుంగనూరు సిఐ కు సమాచారం అందించారు. మృతుడి మరణంపై కుటుంబ సభ్యులు తీవ్ర అనుమానం వ్యక్తం చేస్తున్నారు.