రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు.. ఘన నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు
నందిగామ:
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారతరత్న, భారతదేశంలో ఐటీ రంగానికి ఆద్యుడిగా పేరొందిన మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నందిగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మంద వజ్రయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని, ముఖ్యంగా సమాచార సాంకేతిక రంగానికి ఆయన వేసిన పునాదులు నేటి భారత ప్రగతికి మార్గదర్శకంగా నిలిచాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, నందిగామ మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ పాలేటి సతీష్, జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ చైర్మన్ తుమ్మల నాగేశ్వరరావు, చందర్లపాడు మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వేల్పుల శ్రీహరి, కంచికచర్ల మండల కాంగ్రెస్ కార్యదర్శి యద్దనపూడి కృష్ణారావు, సీనియర్ నాయకులు వరదబోయిన చిట్టిబాబు, పెసరవెల్లి శ్యాంబాబు, కనకపూడి వెంకటేశ్వరరావు, నారిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.