BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 20 August 2026, 03:09 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు.. ఘన నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Aug, 2026 - 03:09 PM
40 వీక్షణలు

నందిగామ:

ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారతరత్న, భారతదేశంలో ఐటీ రంగానికి ఆద్యుడిగా పేరొందిన మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా నందిగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మంద వజ్రయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని, ముఖ్యంగా సమాచార సాంకేతిక రంగానికి ఆయన వేసిన పునాదులు నేటి భారత ప్రగతికి మార్గదర్శకంగా నిలిచాయని పేర్కొన్నారు.

కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, నందిగామ మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ పాలేటి సతీష్, జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ చైర్మన్ తుమ్మల నాగేశ్వరరావు, చందర్లపాడు మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వేల్పుల శ్రీహరి, కంచికచర్ల మండల కాంగ్రెస్ కార్యదర్శి యద్దనపూడి కృష్ణారావు, సీనియర్ నాయకులు వరదబోయిన చిట్టిబాబు, పెసరవెల్లి శ్యాంబాబు, కనకపూడి వెంకటేశ్వరరావు, నారిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.