www.ntodaynews.com
రాష్ట్రపతి రాకతో అనంతపురంలో సందడి.. ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే బండారు శ్రావణి
ఆంధ్రప్రదేశ్
/
అనంతపురం
అనంతపురంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆత్మీయంగా, ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్రపతి రాకతో విశ్వవిద్యాలయ ప్రాంగణం ప్రత్యేక సందడిని సంతరించుకోగా, విద్యార్థులు, అధ్యాపకులు, ప్రజాప్రతినిధులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.