www.ntodaynews.com
బుధవారం బూరుగుగూడెం గ్రామంలో పట్టాదారు పాసుబుక్కుల పంపిణీ
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
బుధవారం చాట్రాయి మండలం, బూరుగుగూడెం గ్రామంలో పట్టాదారు పాసుబుక్కుల పంపిణీ
మీ భూమి – మీ హక్కు కార్యక్రమం
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని బూరుగుగూడెం గ్రామంలో 08-04-2026 తేదీ సాయంత్రం 4:00 గంటలకు "మీ భూమి – మీ హక్కు" అనే కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పట్టాదారులకు పాసుబుక్కులు పంపిణీ చేయనున్నారు. చాట్రాయి టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు ఈ విషయాన్ని తెలియజేస్తూ, ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సహకరించాలని కోరారు.