BREAKING
జనసేన పార్టీ కమిటీలు నేడు సాయంత్రం 5 గంటలకు విడుదల వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జనసేన పార్టీ కమిటీలు నేడు సాయంత్రం 5 గంటలకు విడుదల వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు
www.ntodaynews.com

రేపు ఢిల్లీకి రేవంత్ రెడ్డి – మెట్రోపై కీలక చర్చలు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Jun, 2026 - 08:01 AM
74 వీక్షణలు

హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టు పెండింగ్ అంశాలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మరోసారి లేఖ రాశారు.

ఈ నెల 16న రాసిన లేఖను ప్రస్తావిస్తూ, తాజా లేఖలో ఈ నెల 22, 23 తేదీల్లో తాను ఢిల్లీ పర్యటనకు వస్తున్నట్లు తెలిపారు. ఆ సమయంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు.

హైదరాబాద్ నగరం, తెలంగాణ అభివృద్ధికి కీలకమైన ప్రాజెక్టుగా మెట్రో రైలు విస్తరణకు అత్యంత ప్రాధాన్యం ఉందని లేఖలో పేర్కొన్నారు. ఫేజ్–2 విస్తరణకు సంబంధించిన పెండింగ్ సమస్యలు త్వరగా పరిష్కారమయ్యేలా కేంద్రం జోక్యం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సమావేశంలో మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా వివరించనున్నట్లు తెలిపారు. అవసరమైన ఒప్పందాలు, పత్రాల ప్రతులు కూడా తీసుకువస్తానని పేర్కొన్నారు. సమావేశ ఏర్పాటుకు తక్షణ చర్యలు తీసుకుని వివరాలు తెలియజేయాలని కోరారు.