రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఒకేసారి 3 నెలల కోటా!
రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఒకేసారి 3 నెలల కోటా!
పెరుగుతున్న ఎండల దృష్ట్యా రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమనం కలిగించింది. లబ్ధిదారులు పదేపదే ఎండలో క్యూ కట్టే అవసరం లేకుండా ఏప్రిల్, మే, జూన్ నెలల రేషన్ను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది.
3 నెలల బియ్యం: ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున, మూడు నెలలకు కలిపి మొత్తం 18 కిలోల బియ్యం ఒకేసారి ఇస్తారు.
కుటుంబ కోటా: 4 సభ్యులున్న కుటుంబానికి 72 కిలోలు, 5 సభ్యులుంటే 90 కిలోల బియ్యం అందుతాయి.
అంత్యోదయ కార్డు: ఈ కార్డు ఉన్నవారికి 3 నెలలకు కలిపి మొత్తం 105 కిలోల రేషన్ లభిస్తుంది.
గోదాముల్లో నిల్వలు పెరగడం, వేసవి తాపం దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయం నేటి నుంచే అమలులోకి రానుంది. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం లేదా సాయంత్రం వేళల్లో రేషన్ తీసుకోవాలని అధికారులు సూచించారు.