BREAKING
జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత.. జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత..
www.ntodaynews.com

రేవంత్‌తో షేక్ హ్యాండ్ – రోజాకు మైనస్ మార్కులే!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Mar, 2026 - 06:08 AM
72 వీక్షణలు

రేవంత్‌తో షేక్ హ్యాండ్ – రోజాకు మైనస్ మార్కులే!

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రేవంత్ రెడ్డితో వైసీపీ నేత రోజా షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇది రోజా రాజకీయ భవిష్యత్తుపై చర్చకు దారి తీస్తోంది.

ఇప్పటికే పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీ వెళ్లిన రోజా.. తన పనులు ముగించుకుని బయటకు వస్తుండగా, అదే సమయంలో రేవంత్ రెడ్డి లోపలికి వెళ్తున్నారు. సాధ్యమైనంత వరకు దూరంగా వెళ్లాలని ప్రయత్నించినా, రేవంత్ స్వయంగా పలకరించి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత ఇద్దరూ కొద్దిసేపు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంలో వేమ్ నరేందర్ రెడ్డిను కూడా రోజా పలకరించడం గమనార్హం.

అయితే ఈ వీడియో ఎవరూ ప్లాన్ చేసి తీసింది కాదు. అక్కడే ఉన్నవారు మొబైల్‌తో చిత్రీకరించగా, అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ ఈ చిన్న సంఘటన ఇప్పుడు పెద్ద రాజకీయ చర్చకు కారణమైంది.

గతంలో కూడా ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన విందుకు హాజరైన వైసీపీ ఎంపీలకు టిక్కెట్లు దక్కలేదనే ఉదాహరణను ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఈ వీడియోను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలా తీసుకుంటారన్నది కీలకంగా మారింది.

పార్టీలో ఇప్పటికే అంతర్గత విభేదాలు ఉన్న సమయంలో, ఇలాంటి పరిణామాలు రోజాకు ప్రతికూలంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి నేతలతో ఉన్న విభేదాలు కూడా రోజా పరిస్థితిని మరింత క్లిష్టం చేసే అవకాశముంది.

మొత్తానికి, సాధారణంగా కనిపించే ఒక పలకరింపు ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. జగన్ దీనిని ఎలా అర్థం చేసుకుంటారన్నదానిపైనే రోజా భవిష్యత్ రాజకీయ ప్రాధాన్యత ఆధారపడి ఉండటం ఆసక్తికరంగా మారింది.