BREAKING
ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ..
Date of Publish : 19 March 2026, 06:08 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రేవంత్‌తో షేక్ హ్యాండ్ – రోజాకు మైనస్ మార్కులే!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Mar, 2026 - 06:08 AM
167 వీక్షణలు

రేవంత్‌తో షేక్ హ్యాండ్ – రోజాకు మైనస్ మార్కులే!

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రేవంత్ రెడ్డితో వైసీపీ నేత రోజా షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇది రోజా రాజకీయ భవిష్యత్తుపై చర్చకు దారి తీస్తోంది.

ఇప్పటికే పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీ వెళ్లిన రోజా.. తన పనులు ముగించుకుని బయటకు వస్తుండగా, అదే సమయంలో రేవంత్ రెడ్డి లోపలికి వెళ్తున్నారు. సాధ్యమైనంత వరకు దూరంగా వెళ్లాలని ప్రయత్నించినా, రేవంత్ స్వయంగా పలకరించి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత ఇద్దరూ కొద్దిసేపు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంలో వేమ్ నరేందర్ రెడ్డిను కూడా రోజా పలకరించడం గమనార్హం.

అయితే ఈ వీడియో ఎవరూ ప్లాన్ చేసి తీసింది కాదు. అక్కడే ఉన్నవారు మొబైల్‌తో చిత్రీకరించగా, అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ ఈ చిన్న సంఘటన ఇప్పుడు పెద్ద రాజకీయ చర్చకు కారణమైంది.

గతంలో కూడా ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన విందుకు హాజరైన వైసీపీ ఎంపీలకు టిక్కెట్లు దక్కలేదనే ఉదాహరణను ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఈ వీడియోను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలా తీసుకుంటారన్నది కీలకంగా మారింది.

పార్టీలో ఇప్పటికే అంతర్గత విభేదాలు ఉన్న సమయంలో, ఇలాంటి పరిణామాలు రోజాకు ప్రతికూలంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి నేతలతో ఉన్న విభేదాలు కూడా రోజా పరిస్థితిని మరింత క్లిష్టం చేసే అవకాశముంది.

మొత్తానికి, సాధారణంగా కనిపించే ఒక పలకరింపు ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. జగన్ దీనిని ఎలా అర్థం చేసుకుంటారన్నదానిపైనే రోజా భవిష్యత్ రాజకీయ ప్రాధాన్యత ఆధారపడి ఉండటం ఆసక్తికరంగా మారింది.