BREAKING
గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం
www.ntodaynews.com

రైతుల డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి..?

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 May, 2026 - 08:17 PM
103 వీక్షణలు

రైతుల డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి..? రెడ్డిగూడెంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నలు

ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం రెడ్డిగూడెం గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతే రాజు అంటున్న ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించిన నాయకులు.. ఇప్పటివరకు ఎన్ని క్వింటాళ్ల ధాన్యానికి కాటాలు వేశారో, అందులో ఎంత ధాన్యాన్ని లారీల ద్వారా తరలించారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. రైతులు సొంత ఖర్చులతో ధాన్యం తరలించినప్పటికీ రవాణా చార్జీలు, హమాలి కూలీల డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

100 కిలోల ధాన్యానికి 125 కిలోలుగా కటింగ్ వేస్తూ అదనంగా 25 కిలోలు ఎందుకు నమోదు చేస్తున్నారో అధికారులు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. రైతులు స్వయంగా రవాణా చేసిన ధాన్యానికి సంబంధించిన హమాలి కూలీల డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయని నిలదీశారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులు భరించిన రవాణా ఖర్చులు, హమాలి చార్జీలను మిల్లర్ల నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

ఒక్క రెడ్డిగూడెం సొసైటీ ద్వారానే సేకరించిన ధాన్యానికి సంబంధించి సుమారు రూ.25 లక్షలు కిరాయి రూపంలో బడా నాయకుల జేబుల్లోకి వెళ్తున్నాయని ఆరోపించారు. దీనిపై సొసైటీ అధ్యక్షుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని, లేకపోతే రైతు ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెడ్డిగూడెం మండల వైస్ ఎంపీపీ, ఎన్టీఆర్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చాట్ల రాబర్ట్ పాల్గొన్నారు.