BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

రైతుల సంక్షేమమే సహకార సంఘాల ధ్యేయం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Apr, 2026 - 06:44 PM
152 వీక్షణలు

రైతు బిడ్డకు అండగా సహకార సంఘం… మానవత్వం చాటిన చనుబండ పీఏసీఎస్

రైతుల సంక్షేమమే తమ లక్ష్యమని చనుబండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కష్టకాలంలో రైతు కుటుంబాలకు అండగా నిలవడం సహకార సంఘాల అసలు ధర్మమని ఆయన పేర్కొన్నారు.

గురువారం సాయంత్రం గ్రామంలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఇటీవల కన్నుమూసిన సంఘ సభ్యుడు స్వర్గీయ చిన్నం లక్ష్మీనారాయణ కుటుంబాన్ని పరామర్శించిన సంఘం ప్రతినిధులు, వారి దుఃఖంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా మట్టిఖర్చుల నిమిత్తం సంఘం తరఫున రూ.10,000 నగదు సహాయాన్ని చైర్మన్, డైరెక్టర్లు, సీఈఓ వెంకటేశ్వరరావు కలిసి అందజేశారు.

“రైతు కుటుంబం ఎప్పుడూ ఒంటరిగా ఉండదు… సంఘం మీకు అండగా ఉంటుంది” అంటూ చైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన తీరు అందరినీ కదిలించింది. అంతేకాకుండా, సంఘం ద్వారా లభించే భీమా సొమ్ము కూడా త్వరలోనే అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గవర వెంకటేశ్వరరావు, కంచు మల్లయ్య, నందిపామ్ ప్రభాకరరావు, బాల్ధ భూషణం, ముద్దుల శ్రీనివాసరావు, మల్లేశ్వరరావు, బన్నే వెంకటేశ్వరరావు తదితరులు, రైతులు, సంఘం సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు.