BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

రైతుల సంక్షేమమే సహకార సంఘాల ధ్యేయం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Apr, 2026 - 06:44 PM
114 వీక్షణలు

రైతు బిడ్డకు అండగా సహకార సంఘం… మానవత్వం చాటిన చనుబండ పీఏసీఎస్

రైతుల సంక్షేమమే తమ లక్ష్యమని చనుబండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కష్టకాలంలో రైతు కుటుంబాలకు అండగా నిలవడం సహకార సంఘాల అసలు ధర్మమని ఆయన పేర్కొన్నారు.

గురువారం సాయంత్రం గ్రామంలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఇటీవల కన్నుమూసిన సంఘ సభ్యుడు స్వర్గీయ చిన్నం లక్ష్మీనారాయణ కుటుంబాన్ని పరామర్శించిన సంఘం ప్రతినిధులు, వారి దుఃఖంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా మట్టిఖర్చుల నిమిత్తం సంఘం తరఫున రూ.10,000 నగదు సహాయాన్ని చైర్మన్, డైరెక్టర్లు, సీఈఓ వెంకటేశ్వరరావు కలిసి అందజేశారు.

“రైతు కుటుంబం ఎప్పుడూ ఒంటరిగా ఉండదు… సంఘం మీకు అండగా ఉంటుంది” అంటూ చైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన తీరు అందరినీ కదిలించింది. అంతేకాకుండా, సంఘం ద్వారా లభించే భీమా సొమ్ము కూడా త్వరలోనే అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గవర వెంకటేశ్వరరావు, కంచు మల్లయ్య, నందిపామ్ ప్రభాకరరావు, బాల్ధ భూషణం, ముద్దుల శ్రీనివాసరావు, మల్లేశ్వరరావు, బన్నే వెంకటేశ్వరరావు తదితరులు, రైతులు, సంఘం సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు.