BREAKING
ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం బేడా బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలి చనుబండలో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ​మంచిర్యాల నూతన ఏసీగా రాజు బాధ్యతల స్వీకరణ సూరంపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా పెన్షన్‌ల పంపిణీ డయేరియా నివారణకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు మోసపూరిత మద్దతు ధరలపై రైతు సంఘం ఆందోళన పాడి రైతుల అభివృద్ధే లక్ష్యం కీసర పోలీస్ స్టేషన్‌కు సీపీ సుమతి ​మంచిర్యాల డీఈఓ యాదయ్య బదిలీ ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం బేడా బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలి చనుబండలో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ​మంచిర్యాల నూతన ఏసీగా రాజు బాధ్యతల స్వీకరణ సూరంపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా పెన్షన్‌ల పంపిణీ డయేరియా నివారణకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు మోసపూరిత మద్దతు ధరలపై రైతు సంఘం ఆందోళన పాడి రైతుల అభివృద్ధే లక్ష్యం కీసర పోలీస్ స్టేషన్‌కు సీపీ సుమతి ​మంచిర్యాల డీఈఓ యాదయ్య బదిలీ
www.ntodaynews.com

రైతుల సంక్షేమమే సహకార సంఘాల ధ్యేయం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Apr, 2026 - 06:44 PM
115 వీక్షణలు

రైతు బిడ్డకు అండగా సహకార సంఘం… మానవత్వం చాటిన చనుబండ పీఏసీఎస్

రైతుల సంక్షేమమే తమ లక్ష్యమని చనుబండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కష్టకాలంలో రైతు కుటుంబాలకు అండగా నిలవడం సహకార సంఘాల అసలు ధర్మమని ఆయన పేర్కొన్నారు.

గురువారం సాయంత్రం గ్రామంలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఇటీవల కన్నుమూసిన సంఘ సభ్యుడు స్వర్గీయ చిన్నం లక్ష్మీనారాయణ కుటుంబాన్ని పరామర్శించిన సంఘం ప్రతినిధులు, వారి దుఃఖంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా మట్టిఖర్చుల నిమిత్తం సంఘం తరఫున రూ.10,000 నగదు సహాయాన్ని చైర్మన్, డైరెక్టర్లు, సీఈఓ వెంకటేశ్వరరావు కలిసి అందజేశారు.

“రైతు కుటుంబం ఎప్పుడూ ఒంటరిగా ఉండదు… సంఘం మీకు అండగా ఉంటుంది” అంటూ చైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన తీరు అందరినీ కదిలించింది. అంతేకాకుండా, సంఘం ద్వారా లభించే భీమా సొమ్ము కూడా త్వరలోనే అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గవర వెంకటేశ్వరరావు, కంచు మల్లయ్య, నందిపామ్ ప్రభాకరరావు, బాల్ధ భూషణం, ముద్దుల శ్రీనివాసరావు, మల్లేశ్వరరావు, బన్నే వెంకటేశ్వరరావు తదితరులు, రైతులు, సంఘం సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు.