www.ntodaynews.com
రిజర్వేషన్ కోచ్లోకి అక్రమంగా వెళ్తే రూ.2 వేల జరిమానా!
జాతీయం
రిజర్వేషన్ కోచ్లలోకి సరైన టికెట్ లేకుండా ప్రవేశించే ప్రయాణికులపై దక్షిణ మధ్య రైల్వే కఠిన చర్యలకు సిద్ధమైంది. రిజర్వేషన్ లేని ప్రయాణికులు రిజర్వుడ్ కోచ్లలోకి ప్రవేశిస్తే రూ.2 వేల వరకు జరిమానా విధించనున్నట్లు తెలిపింది.
రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికుల ప్రయాణానికి ఆటంకం కలిగిస్తే రూ.1,000 జరిమానా విధించనున్నారు. జరిమానా చెల్లించేందుకు నిరాకరిస్తే కోర్టు ద్వారా రూ.3 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని రైల్వే అధికారులు హెచ్చరించారు.
జనరల్ టికెట్ ఉన్న ప్రయాణికులు రిజర్వేషన్ కోచ్లలోకి ప్రవేశించవద్దని స్పష్టం చేశారు. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా నిబంధనలు పాటించాలని సూచించారు.