www.ntodaynews.com
రాజంపేట పార్లమెంట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
తెలంగాణ
రాజంపేట పార్లమెంట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
NTODAY NEWS: పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్రరాజు
పుంగనూరు, అన్నమయ్య జిల్లా: మదనపల్లెలోని వై జంక్షన్ సమీపంలోని రామ తులసి కళ్యాణమండపంలో నిర్వహించిన రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శ్రీ చల్లా రామచంద్రా రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో నూతన కార్యవర్గాన్ని అభినందించారు.
రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు, ప్రధాన కార్యదర్శి పటాన్ ఖాదర్ ఖాన్లను చల్లా బాబు రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాషా తదితరులు పాల్గొన్నారు.
రాజంపేట పార్లమెంట్ పరిధిలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ముఖ్య నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లు మరియు ఇతర ప్రతినిధులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
#RajampetParliament #TDP #OathCeremony #AnnamayyaDistrict #Madanapalle #PoliticalNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube