రంజాన్ వేళ నూజివీడులో కానుకల జల్లు..
రంజాన్ వేళ నూజివీడులో కానుకల జల్లు.. 1500 మంది సోదరీమణులకు మంత్రి పార్థసారథి చేతుల మీదుగా చీరల పంపిణీ
ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో రంజాన్ పండుగ సందర్భంగా ఉత్సాహభరిత వాతావరణంలో రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి గారు 1500 మంది ముస్లిం కుటుంబాలకు చెందిన సోదరీమణులకు రంజాన్ కానుకగా చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమం ప్రారంభం నుంచే భారీగా ప్రజలు హాజరై హర్షధ్వానాలతో సభను సందడిగా మార్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రంజాన్ పండుగ సోదరభావం, పరస్పర గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేశారు.