BREAKING
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం
www.ntodaynews.com

రూ.40 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్‌

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jun, 2026 - 03:26 PM
71 వీక్షణలు

 కర్నూలు జిల్లా వెల్దుర్తి మేజర్‌ గ్రామ పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్‌ రూ.40 వేల లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ప్రకారం వెల్దుర్తికి చెందిన సంజుపోగు సతీశ్‌ తనకు ఉన్న రెండు సెంట్ల స్థలంలో గుడిసె వేసుకున్నాడు. ఆ స్థలానికి కొత్త ఇంటి నంబరు మంజూరు చేయడం, ఇంటి పన్ను నమోదు చేయడం కోసం గ్రామ పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్‌ను సంప్రదించాడు.

దీనికి సంబంధించి స్థల అప్రూవల్‌తో పాటు ఇంటి నంబరు మంజూరు చేస్తానని చెప్పిన సెక్రటరీ రూ.50 వేల లంచం డిమాండ్ చేశాడు. అనంతరం బేరసారాల తర్వాత రూ.45 వేలకు ఒప్పందం కుదిరింది. అందులో ముందుగా రూ.40 వేలు ఇవ్వాలని, పని పూర్తయిన తరువాత మిగతా రూ.5 వేలు ఇవ్వాలని నిర్ణయించారు.

లంచం ఇవ్వాల్సి రావడంతో బాధితుడు సతీశ్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం మంగళవారం డబ్బులు తీసుకుని వెల్దుర్తి గ్రామ పంచాయతీ వద్దకు వెళ్లాడు. అనంతరం సెక్రటరీ సూచన మేరకు హైవే–44 ఆంజనేయస్వామి కూడలి వద్ద కర్నూలు వైపు ఉన్న టీ స్టాల్ వద్దకు వెళ్లాడు.

అక్కడ ముందుగానే మాటువేసిన ఏసీబీ డీఎస్పీ సోమన్న బృందం, సతీశ్‌ నుంచి రూ.40 వేల లంచం తీసుకుంటుండగా సెక్రటరీ లక్ష్మీనాథ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. నగదును స్వాధీనం చేసుకుంది.

నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.