BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

రూ.40 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్‌

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jun, 2026 - 03:26 PM
56 వీక్షణలు

 కర్నూలు జిల్లా వెల్దుర్తి మేజర్‌ గ్రామ పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్‌ రూ.40 వేల లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ప్రకారం వెల్దుర్తికి చెందిన సంజుపోగు సతీశ్‌ తనకు ఉన్న రెండు సెంట్ల స్థలంలో గుడిసె వేసుకున్నాడు. ఆ స్థలానికి కొత్త ఇంటి నంబరు మంజూరు చేయడం, ఇంటి పన్ను నమోదు చేయడం కోసం గ్రామ పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్‌ను సంప్రదించాడు.

దీనికి సంబంధించి స్థల అప్రూవల్‌తో పాటు ఇంటి నంబరు మంజూరు చేస్తానని చెప్పిన సెక్రటరీ రూ.50 వేల లంచం డిమాండ్ చేశాడు. అనంతరం బేరసారాల తర్వాత రూ.45 వేలకు ఒప్పందం కుదిరింది. అందులో ముందుగా రూ.40 వేలు ఇవ్వాలని, పని పూర్తయిన తరువాత మిగతా రూ.5 వేలు ఇవ్వాలని నిర్ణయించారు.

లంచం ఇవ్వాల్సి రావడంతో బాధితుడు సతీశ్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం మంగళవారం డబ్బులు తీసుకుని వెల్దుర్తి గ్రామ పంచాయతీ వద్దకు వెళ్లాడు. అనంతరం సెక్రటరీ సూచన మేరకు హైవే–44 ఆంజనేయస్వామి కూడలి వద్ద కర్నూలు వైపు ఉన్న టీ స్టాల్ వద్దకు వెళ్లాడు.

అక్కడ ముందుగానే మాటువేసిన ఏసీబీ డీఎస్పీ సోమన్న బృందం, సతీశ్‌ నుంచి రూ.40 వేల లంచం తీసుకుంటుండగా సెక్రటరీ లక్ష్మీనాథ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. నగదును స్వాధీనం చేసుకుంది.

నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.