BREAKING
ప్రైవేటు వ్యక్తుల చేతిలో బిఎల్వోల లాగిన్ భవానిపురం , క్రాంబ్వే రోడ్డు లోని కుండల బజార్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తా భర్తతో విభేదాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ప్రైవేటు వ్యక్తుల చేతిలో బిఎల్వోల లాగిన్ భవానిపురం , క్రాంబ్వే రోడ్డు లోని కుండల బజార్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తా భర్తతో విభేదాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు
www.ntodaynews.com

రూ.40 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్‌

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jun, 2026 - 03:26 PM
18 వీక్షణలు

 కర్నూలు జిల్లా వెల్దుర్తి మేజర్‌ గ్రామ పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్‌ రూ.40 వేల లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ప్రకారం వెల్దుర్తికి చెందిన సంజుపోగు సతీశ్‌ తనకు ఉన్న రెండు సెంట్ల స్థలంలో గుడిసె వేసుకున్నాడు. ఆ స్థలానికి కొత్త ఇంటి నంబరు మంజూరు చేయడం, ఇంటి పన్ను నమోదు చేయడం కోసం గ్రామ పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్‌ను సంప్రదించాడు.

దీనికి సంబంధించి స్థల అప్రూవల్‌తో పాటు ఇంటి నంబరు మంజూరు చేస్తానని చెప్పిన సెక్రటరీ రూ.50 వేల లంచం డిమాండ్ చేశాడు. అనంతరం బేరసారాల తర్వాత రూ.45 వేలకు ఒప్పందం కుదిరింది. అందులో ముందుగా రూ.40 వేలు ఇవ్వాలని, పని పూర్తయిన తరువాత మిగతా రూ.5 వేలు ఇవ్వాలని నిర్ణయించారు.

లంచం ఇవ్వాల్సి రావడంతో బాధితుడు సతీశ్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం మంగళవారం డబ్బులు తీసుకుని వెల్దుర్తి గ్రామ పంచాయతీ వద్దకు వెళ్లాడు. అనంతరం సెక్రటరీ సూచన మేరకు హైవే–44 ఆంజనేయస్వామి కూడలి వద్ద కర్నూలు వైపు ఉన్న టీ స్టాల్ వద్దకు వెళ్లాడు.

అక్కడ ముందుగానే మాటువేసిన ఏసీబీ డీఎస్పీ సోమన్న బృందం, సతీశ్‌ నుంచి రూ.40 వేల లంచం తీసుకుంటుండగా సెక్రటరీ లక్ష్మీనాథ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. నగదును స్వాధీనం చేసుకుంది.

నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.