www.ntodaynews.com
రెడీ టు సర్వ్' ఫౌండేషన్ ఉచిత అన్నప్రసాధ కార్యక్రమం
తెలంగాణ
గాంధీ ఆసుపత్రి వద్ద 'రెడీ టు సర్వ్' ఫౌండేషన్ ఉచిత అన్నప్రసాధ కార్యక్రమం
NTODAY NEWS: హైదరాబాద్
హైదరాబాద్: పేదరికం, ఆకలితో అల్లాడుతున్న వారికి, ఆసుపత్రిలో రోగులకు సహాయకులుగా వచ్చిన వారికి అండగా నిలుస్తూ 'రెడీ టు సర్వ్' ఫౌండేషన్ (Ready to Serve Foundation) మరియు అమ్మ హెల్పింగ్ హాండ్స్ వారు విశిష్ట సేవలు అందిస్తున్నారు .ఆదివారం సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి వద్ద ఉచిత అన్నప్రసాధ కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రి వద్దకు వచ్చిన దాదాపు 300 మందికి పైగా పేదలకు, రోగుల సహాయకులకు కడుపునిండా భోజనం అందించారు. ప్రతి ఆదివారం హైదరాబాద్లోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద నిరాటంకంగా ఈ అన్నప్రసాధ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, పేదలు ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో ఈ సేవలను కొనసాగిస్తున్నామని ఫౌండేషన్ నిర్వాహకులు పెద్ది శంకర్ తెలిపారు. ఈ నిరంతర సేవ కార్యక్రమంలో వాలంటీర్లుగా పాల్గొనాలనుకునే వారు లేదా ఈ సేవలకు సహకరించాలనుకునే వారు తమను సంప్రదించవచ్చని 'రెడీ టు సర్వ్' నిర్వాహకులు కోరారు.ఈ కార్యక్రమం లో సతీష్ గౌడ్. లక్ష్మణ్ చారి .ఘాట్కెసార్ సైదులు. బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు
Follow us on
Website
Facebook
Instagram
YouTube