SIR నోటీసులు అందుకున్న ఓటర్లకు ఊరట
SIR నోటీసులు అందుకున్న ఓటర్లకు ఊరట కుటుంబ సభ్యులతో ధ్రువపత్రాలు సమర్పించే అవకాశం
కొత్త ఓటర్లకు అక్టోబర్ 1, 2026 అర్హత తేదీ
ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం (SIR)లో నోటీసులు అందుకున్న ఓటర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఊరట కల్పించింది. ఇప్పటివరకు నోటీసులు అందుకున్న ఓటర్లు తమకు సంబంధించిన ధ్రువపత్రాలతో నేరుగా అధికారుల ఎదుట హాజరై వివరాలు సమర్పించాల్సి ఉండేది. తాజాగా ఈ నిబంధనలో సడలింపు కల్పించారు.
నోటీసులు అందుకున్న ఓటర్ల తరఫున వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అధికారుల వద్దకు వెళ్లి అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించేందుకు అవకాశం కల్పించారు. దీంతో వ్యక్తిగతంగా హాజరు కాలేని ఓటర్లకు ఇబ్బందులు తగ్గనున్నాయి.
అదేవిధంగా కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకునే వారికి 2026 అక్టోబర్ 1ను అర్హత తేదీగా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో అర్హత పొందే కొత్త ఓటర్లు ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకునేందుకు అవకాశం లభించనుంది.