www.ntodaynews.com
రేణుక ఎల్లమ్మ పట్నాలు నిర్వహణ
తెలంగాణ
భక్తిశ్రద్ధలతో రేణుక ఎల్లమ్మ పట్నాలు నిర్వహణ
NTODAY NEWS: ధర్మపురి
ధర్మపురి మండలంలోని నక్కలపేట గ్రామంలో రేణుక ఎల్లమ్మ పట్నాల వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
గ్రామానికి చేరుకున్న మంత్రికి గ్రామస్తులు మరియు ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పట్నాల సందర్భంగా నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఆయన వీక్షించారు.
వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలో ఉత్సవ వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు భక్తులు పాల్గొన్నారు.
#Dharmapuri #RenukaEllamma #TempleFestival #TelanganaNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube