విద్యార్థుల మధ్య ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
తెలంగాణ
పార్డ్ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థుల మధ్య ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
NTODAY NEWS: యర్నగూడెం
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్డ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో యర్నగూడెం జడ్పీ హైస్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, విద్యార్థుల్లో దేశభక్తి భావన పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహించారు. ఇటీవల విద్యార్థుల కోసం నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ పెన్మెత్స సుబ్బరాజు, బొల్లిన విజయభాస్కర్, గద్దె శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వూబా చంద్రరావు, మండ సుబ్బారావు, బళ్ల రాము, బాదంపూడి ఇందిర పాల్గొన్నారు. అలాగే పార్డ్ ఇండియా సభ్యులు సోమశెట్టి వెంకటరావు, జి.వి.వి. ప్రసాద్, డాక్టర్ సత్యనారాయణ, ధూళిపూడి రవీంద్ర, కొంపెల్ల బాబూరావు, నల్లమిల్లి దుర్గా భవాని, హేమంత్, దే నాగమణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#RepublicDayCelebrations
#PARDIndia
#StudentsParticipation
#ZPHighSchool
#Yernagudem
#Patriotism
#SocialOrganization
#RepublicDay77
Follow us on
Website
Facebook
Instagram
YouTube