BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

సాకారమైన పేదల దశాబ్దాల కల

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Mar, 2026 - 06:12 PM
108 వీక్షణలు

సాకారమైన పేదల దశాబ్దాల కల

ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలోని పోరాట నగర్లో పేదల దశాబ్దాల కల సాకారమైంది. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు ఆదేశాలతో పేదలకు పొజిషన్ సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది.

పోరాట నగర్లో దశాబ్దాలుగా నివసిస్తున్న పేదలకు స్థలాలకు సంబంధించిన పొజిషన్ సర్టిఫికెట్లు లేకపోవడంతో ప్రభుత్వం నుంచి పక్కా గృహాలు పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ సమస్యను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన ఆయన పేదలకు సర్టిఫికెట్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.

దీనిపై స్పందించిన రెవిన్యూ శాఖ అధికారులు సర్టిఫికెట్లను సిద్ధం చేయగా, మంగళవారం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు స్వయంగా లబ్ధిదారులకు అందజేశారు. మొత్తం 60 మందికి ఈ సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ, ఎన్నేళ్లుగా పరిష్కారం కాని సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని తెలిపారు. త్వరలోనే వీరికి పక్కా గృహాలు కూడా మంజూరు కానున్నాయి.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ)తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.