BREAKING
​బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి ​బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి పరామర్శ బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి చిన్నంపేట, ఆరుగొలనుపేటలో మహానాడు వీక్షణకు భారీగా తరలిరావాలి ​కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రైతులు అపోహలు, వదంతులు నమ్మవద్దు: మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్త దారుణ హత్య! టమోట మార్కెట్ కు అనువైన స్థలాన్ని కేటాయించాలి ​జన్నారంలో అకాల వర్షం బీభత్సం: ఎస్.కె. గార్డెన్ పైకప్పు ధ్వంసం మంచిర్యాలలో అకాల వర్షం: ప్రజలకు ఉపశమనం.. రైతులకు ఆందోళన ​బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి ​బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి పరామర్శ బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి చిన్నంపేట, ఆరుగొలనుపేటలో మహానాడు వీక్షణకు భారీగా తరలిరావాలి ​కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రైతులు అపోహలు, వదంతులు నమ్మవద్దు: మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్త దారుణ హత్య! టమోట మార్కెట్ కు అనువైన స్థలాన్ని కేటాయించాలి ​జన్నారంలో అకాల వర్షం బీభత్సం: ఎస్.కె. గార్డెన్ పైకప్పు ధ్వంసం మంచిర్యాలలో అకాల వర్షం: ప్రజలకు ఉపశమనం.. రైతులకు ఆందోళన
www.ntodaynews.com

సామాజిక ఉద్యమ నేత మహాత్మ జ్యోతిరావు పూలే 200వ జయంతి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Apr, 2026 - 07:45 PM
140 వీక్షణలు

సామాజిక ఉద్యమ నేత మహాత్మ జ్యోతిరావు పూలే 200వ జయంతి

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్

ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట:

మహాత్మ జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో జరిగిన సభలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్  మాట్లాడుతూ, "పూలే దంపతులు 200 సంవత్సరాల క్రితం 52 పాఠశాలలు స్థాపించి, బాలికలకు విద్యను అందించడమే లక్ష్యంగా కృషి చేశారు. కానీ నేటి సమాజంలో విద్య సామాన్యులకు అందుబాటులో లేదు" అని తెలిపారు.

"కుల వివక్షత, జాతి వివక్షత ఇంకా కొనసాగుతుండడం సిగ్గుతో తలదించుకునే విషయమని" అన్నారు. హరినాథ్ గారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో హిందూ మతోన్మాది ఆర్ఎస్ఎస్ వైస్ ఛాన్స్లర్ వేధింపుల వల్ల రోహిత్ వేముల బలి అయిన ఘటనను పునరావృతం చేసారు.

"రాజకీయ, విద్యా సంస్థల్లో కుల ఆధారిత వివక్షతను నిర్మూలించడానికి రోహిత్ వేముల చట్టం ను తక్షణమే తీసుకురావాలి" అని డిమాండ్ చేస్తూ, UGC ఈక్విటీ రెగ్యులేషన్స్ 2026 అమలు చేయాలని, సుప్రీంకోర్టు స్టేను ఎత్తివేయాలని హరినాథ్  ప్రస్తావించారు.