BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

సామాజిక ఉద్యమ నేత మహాత్మ జ్యోతిరావు పూలే 200వ జయంతి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Apr, 2026 - 07:45 PM
233 వీక్షణలు

సామాజిక ఉద్యమ నేత మహాత్మ జ్యోతిరావు పూలే 200వ జయంతి

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్

ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట:

మహాత్మ జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో జరిగిన సభలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్  మాట్లాడుతూ, "పూలే దంపతులు 200 సంవత్సరాల క్రితం 52 పాఠశాలలు స్థాపించి, బాలికలకు విద్యను అందించడమే లక్ష్యంగా కృషి చేశారు. కానీ నేటి సమాజంలో విద్య సామాన్యులకు అందుబాటులో లేదు" అని తెలిపారు.

"కుల వివక్షత, జాతి వివక్షత ఇంకా కొనసాగుతుండడం సిగ్గుతో తలదించుకునే విషయమని" అన్నారు. హరినాథ్ గారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో హిందూ మతోన్మాది ఆర్ఎస్ఎస్ వైస్ ఛాన్స్లర్ వేధింపుల వల్ల రోహిత్ వేముల బలి అయిన ఘటనను పునరావృతం చేసారు.

"రాజకీయ, విద్యా సంస్థల్లో కుల ఆధారిత వివక్షతను నిర్మూలించడానికి రోహిత్ వేముల చట్టం ను తక్షణమే తీసుకురావాలి" అని డిమాండ్ చేస్తూ, UGC ఈక్విటీ రెగ్యులేషన్స్ 2026 అమలు చేయాలని, సుప్రీంకోర్టు స్టేను ఎత్తివేయాలని హరినాథ్  ప్రస్తావించారు.