BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

సబ్సిడీ గ్యాస్ దుర్వినియోగం బట్టబయలు – 13 సిలిండర్లు స్వాధీనం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 07:25 AM
133 వీక్షణలు

సబ్సిడీ గ్యాస్ దుర్వినియోగం బట్టబయలు – 13 సిలిండర్లు స్వాధీనం

వాణిజ్య అవసరాలకు గృహ వినియోగ సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్న అక్రమ వ్యవహారం ఏలూరు జిల్లాలో బయటపడింది. విశ్వసనీయ సమాచారంపై రీజినల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారి కె. నాగేశ్వరరావు ఆదేశాల మేరకు అధికారులు ఉంగుటూరు, భీమడోలు మండలాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీల్లో ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలోని ఓంకారేశ్వరి బిర్యానీ హోటల్, శ్రీ విఘ్నేశ్వర శ్రీ వెంకటేశ్వర స్వీట్ హోమ్, అలాగే భీమడోలు మండలం ఎం.ఎం.పురం గ్రామంలోని సునీల్ కిరాణా షాపు, హాట్ చిప్స్ వద్ద అక్రమంగా గృహ గ్యాస్ సిలిండర్ల వినియోగం గుర్తించారు.

మొత్తం 13 సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో యజమానులు వాణిజ్య అవసరాలకు కమర్షియల్ సిలిండర్లకు బదులుగా గృహ సిలిండర్లను వినియోగిస్తున్నట్లు అంగీకరించారు.

సుమారు రూ.31,079 విలువైన సిలిండర్లను సీజ్ చేసి, సంబంధిత యజమానులపై నిత్యవసర వస్తువుల చట్టం, 1955 ప్రకారం కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ తనిఖీలలో విజిలెన్స్ ఎస్ఐ కె. నాగరాజు, రెవెన్యూ మరియు పౌర సరఫరా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.