సచివాలయంలో సిబ్బంది లేక రైతు లు ఇక్కట్లు!
గ్రామ సచివాలయము" మిట్టచింతవారిపల్లి పరిధిలోని మిట్ట చింత వారి పల్లిపంచాయతీ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, ఏఎన్ఎం, అగ్రికల్చరల్ అసిస్టెంట్ లేకపోవడంతో సంబంధిత అధికారుల పనిమీద వస్తున్నా రైతులకు ఇక్కట్లు తప్పడం లేదని ఆ పంచాయతీకి చెందిన రైతులు గ్రామపంచాయతీ ప్రజలు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ గతంలో ఇప్పటికే అనేకమార్లు మండల అధికారులకు, గ్రీవెన్స్ లో కూడా కలెక్టర్ కి ఫిర్యాదు చేసి ఉన్నామని, అయినను ఇప్పటివరకు మాగోడు పట్టించుకునే నాధుడు కరువయ్యారని సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న మిగతా అధికారులు కూడా సమయపాలన పాటించడం లేదని రైతులు వాపోయారు.
మా సచివాలయంలోని రైతు భరోసా కేంద్రానికి నేతిగుట్లపల్లి పంచాయతీ రైతు భరోసా కేంద్ర సిబ్బంది అయిన రాజేష్ ను ఇన్చార్జిగా వ్యవహరించమని అగ్రి అగ్రికల్చర్ అధికారులు చెప్పిన దాదాపుగా గత 11 నెలల నుండి మిట్ట చింత వారి పల్లి రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించిన దాఖలు కూడా లేవని రైతులు వారి ఆవేదనను వెల్లబుచ్చారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మా సచివాలయానికి సిబ్బంది కొరత లేకుండా చేసి మా ఇక్కట్లను తప్పించాలని కోరుతున్నాం అన్నారు