BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 12 April 2026, 05:48 pm
Posted by : V శ్రీనివాస్

సీఎంకు దమ్ముంటే సింగరేణి దోపిడీపై 'సిట్' వేయాలి: కేటీఆర్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
12 Apr, 2026 - 05:48 PM
263 వీక్షణలు

​మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని, క్యాతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఇటీవల ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం "దోచుకో-దాచుకో" అనే పథకాన్ని అమలు చేస్తూ అవినీతికి తెరలేపిందని, ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యేల వరకు అందరూ వసూళ్లలో మునిగిపోయారని నిప్పులు చెరిగారు. క్యాతనపల్లిలో అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, అక్రమ కేసులు మరియు పోలీసుల వేధింపులతో భయభ్రాంతులకు గురిచేసినా లొంగకుండా నిలబడిన కౌన్సిలర్ల ధైర్యాన్ని ఆయన కొనియాడారు.

​ముఖ్యంగా సింగరేణిలో జరుగుతున్న దోపిడీ అక్రమాలపై సీఎంకు దమ్ముంటే 'సిట్' (SIT) విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సింగరేణిలో కాంట్రాక్టుల పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డిపై విచారణ జరగాలని, 'సైట్ విజిట్ సర్టిఫికేషన్' పేరుతో జరుగుతున్న దోపిడీపై సీఎం సమాధానం చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. తాము ఏ విచారణకైనా సిద్ధమని స్పష్టం చేస్తూ.. మెడికల్ బోర్డును వెంటనే పునరుద్ధరించి కార్మిక పిల్లలకు న్యాయం చేయాలని, వచ్చే ఎన్నికల్లో TBGKSను గెలిపించాలని పిలుపునిచ్చారు. రైతులు, కార్మికులను మోసం చేసిన కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని, తెలంగాణ బాగుపడాలంటే మళ్ళీ కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని కేటీఆర్ పేర్కొన్నారు.