BREAKING
​నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరికలు ప్రధాన కార్యదర్శిపై తప్పుడు ప్రచారాన్ని ఖండించిన కేంద్ర కమిటీ ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల హెచ్చరిక.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి గురవాయిగూడెంలో శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం విస్సన్నపేటలో విత్తనాల దుకాణాల తనిఖీలు తిరుమలకు పోటెత్తిన భక్తజనం.. 24 గంటల నిరీక్షణ! మృతి చెందిన బొమ్మర సమ్మక్కపరామర్శించిన BRS పార్టీ తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ శుభవార్త రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి శైలజ దుర్మరణం ​నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరికలు ప్రధాన కార్యదర్శిపై తప్పుడు ప్రచారాన్ని ఖండించిన కేంద్ర కమిటీ ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల హెచ్చరిక.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి గురవాయిగూడెంలో శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం విస్సన్నపేటలో విత్తనాల దుకాణాల తనిఖీలు తిరుమలకు పోటెత్తిన భక్తజనం.. 24 గంటల నిరీక్షణ! మృతి చెందిన బొమ్మర సమ్మక్కపరామర్శించిన BRS పార్టీ తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ శుభవార్త రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి శైలజ దుర్మరణం
www.ntodaynews.com

ప్రధాన కార్యదర్శిపై తప్పుడు ప్రచారాన్ని ఖండించిన కేంద్ర కమిటీ

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 May, 2026 - 01:47 PM
15 వీక్షణలు

సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శిపై తప్పుడు ప్రచారాన్ని ఖండించిన కేంద్ర కమిటీ

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ దీపాంకర్ భట్టాచార్య ఫోటోను ఉపయోగించి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పార్టీ కేంద్ర కమిటీ తీవ్రంగా ఖండించింది.

అదే పేరుతో ఉన్న ఓ తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి వ్యవహారానికి సంబంధించి వార్తలను ప్రసారం చేస్తూ, కామ్రేడ్ దీపాంకర్ భట్టాచార్య ఫోటోను ప్రచురించడం తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. ఆ నాయకుడి నివాసంలో భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నాయకుడి చిత్రాన్ని ఉపయోగించడం పూర్తిగా తప్పుదోవ పట్టించే చర్య అని తెలిపింది.

ఇలాంటి తప్పుడు సమాచారాన్ని దురుద్దేశపూర్వకంగా ప్రచారం చేసి పార్టీ నాయకుడి ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ఆంధ్ర రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి. హరినాథ్ అన్నారు.

ఈ విషయంలో సంబంధిత పత్రికలు, మీడియా సంస్థలు తమ తప్పును వెంటనే సరిదిద్దుకుని, ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వడంతో పాటు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.