BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

ప్రధాన కార్యదర్శిపై తప్పుడు ప్రచారాన్ని ఖండించిన కేంద్ర కమిటీ

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 May, 2026 - 01:47 PM
252 వీక్షణలు

సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శిపై తప్పుడు ప్రచారాన్ని ఖండించిన కేంద్ర కమిటీ

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ దీపాంకర్ భట్టాచార్య ఫోటోను ఉపయోగించి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పార్టీ కేంద్ర కమిటీ తీవ్రంగా ఖండించింది.

అదే పేరుతో ఉన్న ఓ తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి వ్యవహారానికి సంబంధించి వార్తలను ప్రసారం చేస్తూ, కామ్రేడ్ దీపాంకర్ భట్టాచార్య ఫోటోను ప్రచురించడం తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. ఆ నాయకుడి నివాసంలో భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నాయకుడి చిత్రాన్ని ఉపయోగించడం పూర్తిగా తప్పుదోవ పట్టించే చర్య అని తెలిపింది.

ఇలాంటి తప్పుడు సమాచారాన్ని దురుద్దేశపూర్వకంగా ప్రచారం చేసి పార్టీ నాయకుడి ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ఆంధ్ర రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి. హరినాథ్ అన్నారు.

ఈ విషయంలో సంబంధిత పత్రికలు, మీడియా సంస్థలు తమ తప్పును వెంటనే సరిదిద్దుకుని, ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వడంతో పాటు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.