www.ntodaynews.com
సెల్ఫోన్ ద్వారా వైద్యం అందించి చిన్నారి మృతికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
తెలంగాణ
/
వికారాబాద్
వికారాబాద్ జిల్లా: వికారాబాద్లోని మహావీర్ హాస్పిటల్లో ఓ చిన్నారికి వైద్యులు ప్రత్యక్షంగా పరీక్షించకుండా సెల్ఫోన్ ద్వారా చికిత్స సూచించారనే ఆరోపణలు వెలువడ్డాయి. సరైన సమయంలో తగిన వైద్యం అందకపోవడంతో చిన్నారి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైద్యుల నిర్లక్ష్యమే తమ బిడ్డ ప్రాణాలు తీసిందని ఆరోపిస్తూ చిన్నారి మృతదేహంతో ఆస్పత్రి ఎదుట తల్లిదండ్రులు రోదించారు. ఘటనపై స్థానిక ఎమ్మెల్యే ప్రసాద్ కుమార్ స్పందిస్తూ, బాధ్యులైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిజానిజాలను వెలికితీయాలని స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు.