సెంచరీతో అదరగొట్టిన డీజీపీ సీవీ ఆనంద్
తెలంగాణ
సి-డివిజన్ వన్డే లీగ్లో అద్భుత ప్రదర్శన.. 126 పరుగులతో నాటౌట్
హైదరాబాద్: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ క్రికెట్ మైదానంలో తన సత్తా చాటారు. సి-డివిజన్ వన్డే లీగ్ ఛాంపియన్షిప్లో భాగంగా జరిగిన మ్యాచ్లో సెంచరీతో మెరిశారు.
హైదరాబాద్ జిల్లా జట్టుతో జరిగిన మ్యాచ్లో సికింద్రాబాద్ క్లబ్ తరఫున ఓపెనర్గా బరిలోకి దిగిన సీవీ ఆనంద్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ 126 పరుగులతో నాటౌట్గా నిలిచారు.
డీజీపీ స్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తూ క్రికెట్పై ఉన్న ఆసక్తిని కొనసాగిస్తున్న సీవీ ఆనంద్ ప్రదర్శనపై క్రీడాభిమానులు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన సెంచరీ సాధించిన దృశ్యాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.