BREAKING
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి
www.ntodaynews.com

శ్రీరాములవారి కల్యాణోత్సవం వేడుకలు పాల్గొన్న శాసనసభ్యులు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
05 Apr, 2026 - 08:05 PM
14 వీక్షణలు

సెంట్ సెంట్రల్ నియోజకవర్గంలో శ్రీనగర్ ఒకటో లైన్ లో ఘనంగా శ్రీరాములవారి కల్యాణోత్సవం వేడుకలు పాల్గొన్న శాసనసభ్యులు  బోండా ఉమా

ధి:- 5-4-2026, ఆదివారం సెంట్రల్ నియోజకవర్గంలోని శ్రీనగర్ 1వ లైన్‌ నందు మరియు మధురానగర్ శ్రీరాములవారి ఆలయం వద్ద ఘనంగా నిర్వహించిన శ్రీశ్రీశ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొండా ఉమామహేశ్వరరావ పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ముందుగా శ్రీ సీతారాముల వారి దర్శనం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి దైవ ఆశీర్వాదాలు స్వీకరించారు. ఆలయ వేద పండితులు వేదమంత్రాల నడుమ సంప్రదాయబద్ధంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించగా, ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.


అనంతరం కొబ్బరికాయ కొట్టి అన్నసంతర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గారు స్వయంగా భక్తులకు అన్నదానం చేయడం జరిగింది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ సమానంగా అన్నదానం అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. భక్తులతో స్నేహపూర్వకంగా మమేకమై వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకుంటూ కార్యక్రమాన్ని కొనసాగించారు.


ఈ సందర్భంగా బొండా ఉమ  మాట్లాడుతూ:- శ్రీ సీతారాముల కళ్యాణం మన సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, సౌహార్దత, ధార్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడుస్తూ సమాజ సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.


అదేవిధంగా ఆలయ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని, స్థానిక ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని హామీ ఇచ్చారు.


ఈ కార్యక్రమంలో:- మాజీ కార్పొరేటర్ పిన్నమ్మరాజు త్రిమూర్తి రాజు, సింగం వెంకన్న, కొండా మాలకొండయ్య, గడ్డం శ్రీనివాసరావు మేడసాని చంద్రశేఖర్,దేవరపు మాల్యాద్రి, సింగి వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, మహిళలు, యువత, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.