BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

సహజ వ్యవసాయం, ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన

తెలంగాణ
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
19 Jun, 2026 - 04:12 PM
66 వీక్షణలు

50-60 మి.మీ వర్షం పడ్డాకే విత్తనాలు నాటాలి

హాజీపూర్‌లో ఎన్.ఎమ్.ఎన్.ఎఫ్ (NMNF) ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు

మంచిర్యాల డివిజన్ హాజీపూర్ మండలంలో జాతీయ సహజ వ్యవసాయ మిషన్ (NMNF) ఆధ్వర్యంలో శుక్రవారం (19.06.2026) రైతులకు ప్రత్యేక అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో పశుపోషణతో సహజ వ్యవసాయానికి ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ, రైతులు తమ పొలంలోనే సొంతంగా బీజామృతం, జీవామృతం తయారు చేసుకునే విధానాలను, బహుళ పంటల సాగు ఆవశ్యకతను అధికారులు తెలియజేశారు. ఈ సదస్సులో మంచిర్యాల ఏడీఏ (ADA) మామిడి క్రిష్ణ, హాజీపూర్ వ్యవసాయ అధికారి క్రిష్ణ, ఏఈవో మధుప, కృషి సఖి స్వప్నతో పాటు పలువురు సేంద్రీయ వ్యవసాయ రైతులు పాల్గొన్నారు.

​ప్రస్తుతం పొంచివున్న ఎల్-నినో (El Nino) ప్రభావం, తీవ్ర వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు ఈ సదస్సులో అధికారులు రైతులకు కీలక సూచనలు చేశారు. తొలకరికే ఆత్రుతపడి విత్తనాలు నాటవద్దని, కనీసం 50-60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై, 3-4 రోజుల పాటు వర్షాలు పడిన తర్వాతే విత్తనాలు నాటాలని స్పష్టం చేశారు. అలాగే నీటి వినియోగం ఎక్కువగా ఉండే వరికి బదులుగా ఆరుతడి పంటలైన పప్పుదినుసులు, జొన్నలు వంటి మెట్ట పంటలను సాగుచేయాలని, పంటల మార్పిడిలో భాగంగా ఆయిల్ పామ్ సాగు పట్ల ఆసక్తి చూపాలని రైతులకు దిశానిర్దేశం చేశారు