BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

​సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
21 Jul, 2026 - 07:45 PM
39 వీక్షణలు

​సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

మంచిర్యాల జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సింగరేణి బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని ఓపెన్‌కాస్ట్ గనుల్లో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి డివిజన్లలోని గనుల్లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో డంపర్లు, ఎక్స్‌కవేటర్లు వంటి భారీ యంత్రాలు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. దీని ఫలితంగా బొగ్గు ఉత్పత్తి, ఓవర్ బర్డెన్ (ఓబీ) వెలికితీత మరియు రవాణా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలగడంతో గనుల్లో పనులు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి.

​ఈ భారీ వర్షాల వల్ల ఒక్కరోజులోనే దాదాపు 32 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తితో పాటు సుమారు 1 లక్షా 80 వేల క్యూబిక్ మీటర్ల ఓబీ వెలికితీతకు అంతరాయం ఏర్పడినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అంతరాయం సంస్థ మొత్తం ఉత్పత్తి లక్ష్యాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టిన తర్వాత గనుల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించి, పరిస్థితిని క్షుణ్ణంగా సమీక్షించిన అనంతరం మాత్రమే పూర్తి స్థాయిలో కార్యకలాపాలను పునఃప్రారంభిస్తామని సింగరేణి అధికారులు స్పష్టం చేశారు