BREAKING
ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి
www.ntodaynews.com

​సింగరేణి విశ్రాంత ఉద్యోగులకూ రూ. 50 లక్షల ప్రమాద బీమా కల్పించాలి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
24 Apr, 2026 - 12:19 PM
214 వీక్షణలు

​- మంచిర్యాల జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి

- సింగరేణి అభివృద్ధికి కృషి చేసిన మాకు అండగా నిలవండి

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 51వ డివిజన్ లక్ష్మీనగర్ కాలనీలో జరిగిన జిల్లా సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘ సమావేశంలో, సింగరేణి సంస్థ అభివృద్ధి కోసం దశాబ్దాల పాటు శ్రమించి సంస్థను లాభాల బాటలోకి తెచ్చిన తమకు కూడా రూ. 50 లక్షల ప్రమాద బీమా మరియు రూ. 10 లక్షల సహజ మరణ బీమా సౌకర్యం కల్పించాలని విశ్రాంత ఉద్యోగులు యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేశారు. గతంలో సింగరేణి కష్టకాలంలో ఉన్నప్పుడు అహర్నిశలు శ్రమించి నేడు వేల కోట్ల లాభాలు రావడానికి పునాదులు వేసిన తమకు, పదవీ విరమణ తర్వాత చాలీచాలని పెన్షన్‌తో వైద్య ఖర్చులు భరించడం భారంగా మారిందని, అందుకే ప్రస్తుత కార్మికులకు ఇస్తున్న తరహాలోనే బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా సింగరేణిలో నూతన బీమా పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎండీ డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతికి మరియు ఎస్‌బీఐ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూనే, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి మరియు ప్రజాప్రతినిధులు చొరవ చూపి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, గౌరవ అధ్యక్షుడు రాళ్లబండి రాజన్న, ప్రధాన కార్యదర్శి పూదరి నర్సయ్య, నాయకులు గూడ రాజిరెడ్డి, ఎం సత్యనారాయణ, గోపతి లక్ష్మణ్, అడిచర్ల రాజేశం, బాపు తదితరులు పాల్గొన్నారు