సిరిపురంలో వెలగపూడి శివరాం ప్రసాద్కు ఘన నివాళి
తెలంగాణ
/
ఖమ్మం
తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం సిరిపురం గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మార్క్ఫెడ్ డైరెక్టర్, సీనియర్ నాయకుడు వెలగపూడి శివరాం ప్రసాద్ మొదటి వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వెలగపూడి శివరాం ప్రసాద్ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో వక్తలు ఆయన ప్రజా సేవలను, నాయకత్వ లక్షణాలను గుర్తుచేసుకుంటూ ఘనంగా కొనియాడారు. సమాజానికి, ప్రజలకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వేమిరెడ్డి లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచ్ కనకపూడి సులోమాన్, జర్నలిస్టు జీవి, ప్రభాకర్, భాస్కర్, రవి తదితరులు పాల్గొన్నారు.