www.ntodaynews.com
స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పల్నాడు జిల్లా రవాణా శాఖ స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. ఈ మేరకు పల్నాడు జిల్లా రవాణా అధికారి సంజీవ్ కుమార్ వివరాలు వెల్లడించారు.
నరసరావుపేటలో ఆరు ప్రత్యేక బృందాలతో పది రోజుల పాటు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పాఠశాల బస్సుల ఫిట్నెస్, పర్మిట్లు, బీమా, అగ్నిమాపక పరికరాలు, అత్యవసర ద్వారాలు, భద్రతా ప్రమాణాలు తదితర అంశాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
తనిఖీల్లో నిబంధనలు పాటించని ఐదు స్కూల్ బస్సులను గుర్తించి సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థుల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా నిబంధనలను ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పాఠశాల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించి విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని రవాణా శాఖ సూచించింది.