BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

100 మీటర్లలోపు విక్రయాలు నిషేధం

తెలంగాణ
02 Mar, 2026 - 07:44 AM
294 వీక్షణలు
పాఠశాలల పరిసరాల్లో 100 మీటర్లలోపు విక్రయాలు నిషేధం: ఎస్సై విష్ణుమూర్తి హెచ్చరిక NTODAY NEWS: నార్కట్‌పల్లి, నల్గొండ జిల్లా మైనర్లకు పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై నార్కట్‌పల్లి పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు సోమవారం నార్కట్‌పల్లి ఎస్సై విష్ణుమూర్తి ఆధ్వర్యంలో కిరాణా దుకాణాలు, పాన్‌షాపుల యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పాఠశాలల పరిసరాల్లో 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయం పూర్తిగా నిషేధమని ఎస్సై స్పష్టం చేశారు. మైనర్లకు సిగరెట్లు, గుట్కా, ఖైనీ తదితర పదార్థాలు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు చేపడతామని తెలిపారు. పాఠశాలల సమీపంలోని దుకాణదారులు ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు చౌరస్తాలో జాగ్ బారికేడ్లు నార్కట్‌పల్లి చౌరస్తాలో గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని భారీ వాహనాల నియంత్రణ కోసం జాగ్ బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు ఎస్సై తెలిపారు. సరైన సూచిక బోర్డులు లేకపోవడం, అతివేగం వంటి కారణాలతో ప్రమాదాలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసిన బారికేడ్లు ప్రమాదాల నివారణకు దోహదపడతాయని, వాహనదారులు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని కోరారు. ప్రజల సహకారంతో నార్కట్‌పల్లిలో శాంతి భద్రతలను బలోపేతం చేయడమే తమ లక్ష్యమని ఎస్సై విష్ణుమూర్తి పేర్కొన్నారు. #Narketpally #TobaccoBan #MinorProtection #SchoolSafety #TrafficControl #NalgondaDistrict #PoliceWarning Follow us on Website Facebook Instagram YouTube