BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 05 March 2026, 08:57 am
Posted by : NTODAY NEWS OFFICIAL

చిలకలూరిపేటలో అస్తవ్యస్తంగా పారిశుధ్యం

తెలంగాణ
05 Mar, 2026 - 08:57 AM
295 వీక్షణలు
చిలకలూరిపేటలో అస్తవ్యస్తంగా పారిశుధ్యం NTODAY NEWS: చిలకలూరిపేట ప్రతినిధి రావిపాటి రాజా డ్రైనేజీ పూడికతీత పనులు సగమే.. దుర్వాసనతో ప్రజల అవస్థలు పట్టణంలోని అడ్డ రోడ్డు సెంటర్, సంజీవ్ నగర్ పరిధిలో పారిశుధ్య నిర్వహణ పూర్తిగా దెబ్బతింది. మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు పారిశుధ్యంపై సమీక్షలు నిర్వహిస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కాలువలో తీసిన వ్యర్థాలు రోడ్డుపైనే సంజీవ్ నగర్ మెయిన్ డ్రైనేజీ కాలువలో పూడికతీత పనులు చేపట్టిన సిబ్బంది ప్లాస్టిక్ వ్యర్థాలు, బురదను తీసి రోడ్డు పక్కనే కుప్పలుగా వదిలేశారు. నాలుగు రోజులు గడిచినా ఆ వ్యర్థాలను అక్కడి నుంచి తరలించకపోవడంతో స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పనులు సగం చేసి వదిలేయడంతో డ్రైనేజీ శుభ్రత కూడా పూర్తిగా సాధ్యపడలేదని అంటున్నారు. వ్యాపారుల గోడు.. దుర్వాసనతో ఇబ్బందులు డ్రైనేజీ నుంచి తీసిన వ్యర్థాలను రోడ్డుపై కుప్పలుగా వేయడంతో ఆ ప్రాంతంలో తీవ్ర దుర్వాసన వ్యాపిస్తోంది. ముఖ్యంగా సమీపంలో టిఫిన్ బండ్లు, చిన్నచిన్న వ్యాపారాలు నిర్వహించే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుర్వాసన కారణంగా కస్టమర్లు రాకపోవడంతో తమ జీవనోపాధి దెబ్బతింటోందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాలికి ఆ ఎండిన వ్యర్థాలు తిరిగి కాలువల్లో పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు ఇటీవలే పారిశుధ్యంపై సమీక్ష నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించినప్పటికీ, శానిటరీ ఇన్స్పెక్టర్లు మరియు సిబ్బంది మాత్రం స్పందించడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి వెంటనే డ్రైనేజీ వ్యర్థాలను తొలగించి పారిశుధ్య సమస్యలను పరిష్కరించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. #Chilakaluripet #SanitationIssue #DrainageProblem #MunicipalNegligence #AndhraPradeshNews #LocalIssues #PublicHealth #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube