www.ntodaynews.com
సర్ ఎఫెక్ట్.. తెలంగాణలో 24 లక్షల ఓట్లు తొలగే అవకాశం
తెలంగాణ
సర్ ఎఫెక్ట్.. తెలంగాణలో 24 లక్షల ఓట్లు తొలగే అవకాశం
హైదరాబాద్, జూలై 24: తెలంగాణలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా దాదాపు 24 లక్షల ఓట్లు తొలగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో మొత్తం 3.38 కోట్ల ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 71.34 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తైంది. బీఎల్ఓల క్షేత్రస్థాయి పరిశీలనలో 6.50 లక్షల మంది మరణించిన ఓటర్లు, 12 లక్షలకు పైగా శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు, 2.60 లక్షల డూప్లికేట్ ఓటర్లు, 78 వేల మంది ఆచూకీ లేని ఓటర్లు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
వచ్చే నెల 3న విడుదలయ్యే ముసాయిదా ఓటరు జాబితా నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.