BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 06 September 2026, 06:45 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సర్వేపల్లి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Sep, 2026 - 06:45 AM
13 వీక్షణలు

ఉపాధ్యాయులు భావితరాలకు మార్గదర్శకులుగా నిలవాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్: ఉపాధ్యాయుల సేవలు, వారి గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి గౌరవించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. విజ్ఞానాన్ని అందించే గురువు సమాజానికి విజ్ఞాన వృక్షం లాంటి వారని పేర్కొన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు మార్గదర్శకులుగా నిలిచే ఉపాధ్యాయులను నిత్యం గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలను స్మరించుకున్న పవన్ కల్యాణ్.. ఆయన చూపిన విద్యా విలువలు, ఆదర్శాలను ప్రతి ఉపాధ్యాయుడు ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాలను బోధించడమే కాకుండా, నైతిక విలువలు, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన పౌరస్ఫూర్తిని పెంపొందించేలా తీర్చిదిద్దాలని అన్నారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందని పేర్కొన్న పవన్ కల్యాణ్.. సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులను తయారు చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ స్ఫూర్తితో పనిచేస్తూ, బంగారు భారతావనిని నిర్మించే భావితరాలను తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.