BREAKING
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సైదాబాద్‌లో 98 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత తుమ్మలగూడెంలో రజక వృత్తిదారుల సంఘం సర్వే ఫారం ఆవిష్కరణ ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు సీపీఎం కార్యాలయంపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం: సీపీఎం 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సైదాబాద్‌లో 98 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత తుమ్మలగూడెంలో రజక వృత్తిదారుల సంఘం సర్వే ఫారం ఆవిష్కరణ ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు సీపీఎం కార్యాలయంపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం: సీపీఎం
www.ntodaynews.com

స్వాతంత్ర్య వేడుకల్లో విద్యార్థులకు ఉపకార వేతనాలు, నగదు బహుమతులు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
16 Aug, 2026 - 10:52 AM
16 వీక్షణలు

స్వాతంత్ర్య వేడుకల్లో విద్యార్థులకు ఉపకార వేతనాలు, నగదు బహుమతులు

చిట్యాల: పీఎంఎస్‌హెచ్‌ఆర్‌ఐ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చిట్యాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రధానోపాధ్యాయులు బి. సుశీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కెనరా బ్యాంక్ మేనేజర్ ఏ. బిశ్వాస్ విద్యార్థినులు రుచిత, భవాని, తేజ, సహస్ర, హారిక, కామాక్షిలకు ఉపకార వేతనాలను అందజేశారు. గత సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో తమ తమ సబ్జెక్టుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు సంకీర్తన, షాహిన్, పూజ, శివప్రసాద్, మల్లన్న, యాస్మిన్, శిరీష, భవాని, ధన్యకౌర్‌లకు ఉపాధ్యాయులు నగదు బహుమతులు అందజేసి అభినందించారు.గణిత ఉపాధ్యాయులు ఇందిర, శైలజ, ఆంగ్ల ఉపాధ్యాయులు కవిత, మంజుల, హిందీ ఉపాధ్యాయులు ఎం.డి. సాదిక్, జీవశాస్త్ర ఉపాధ్యాయులు సరళ విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. అలాగే సీనియర్ ఉపాధ్యాయులు కోణం శ్రీనివాస్ తమ కోణం ఫౌండేషన్ ద్వారా 9వ తరగతి విద్యార్థులకు టీ-షర్టులు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు చిలకరాజు శ్రీనివాస్, ఏ. పద్మజ, ఎన్. సైదులు, సీహెచ్. ప్రసన్న, ఎం. జానకి, ఎం. సౌమ్య, ప్రవీణ్, కుసుమ, శ్రీనివాస్, తిరుమల, నవీన్, హైమవతి తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బహుమతులు, ఉపకార వేతనాలు పొందిన విద్యార్థులను ఈ సందర్భంగా ఉపాధ్యాయులు అభినందించారు.