www.ntodaynews.com
ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు.
తెలంగాణ
ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు.
NTODAY NEWS: ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, ఇబ్రహీంపట్నంలోని సియోను ప్రార్ధనా మందిరంలో సెమిక్రిస్మస్ వేడుకల్లో గౌరవ మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకును కట్ చేశారు. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని చేసుకునే అతి పెద్ద పండుగ క్రిస్మస్ అని తెలిపారు.
లోక రక్షకుడైన యేసుక్రీస్తు ఆశీస్సులు మనందరికీ ఉండాలన్నారు. ప్రపంచమంతా చేసుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అన్నారు. ఏసుక్రీస్తు చూపిన బాటలో మనమంతా నడవాలని సర్వమానవాళి సుఖసంతోషాలతో ఉండాలని ఆ దేవదేవుని ప్రార్ధిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube