శీలం రమేష్కు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సత్కారం
శీలం రమేష్కు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సత్కారం
చండీగఢ్లో నిర్వహించిన జాతీయ స్థాయి యోగా పోటీలలో రజత పతకం సాధించిన శీలం రమేష్ను సోమవారం జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు సత్కరించారు. తన కార్యాలయంలో రమేష్ను అభినందిస్తూ శాలువా కప్పి సన్మానించారు.
దేశంలోని 11 రాష్ట్రాల నుంచి పాల్గొన్న యోగ సాధకులతో పోటీ పడిన రమేష్, విజయవాడ డ్రగ్స్ విభాగానికి చెందిన బీకే రాముడుతో కలిసి ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. హనుమాన్ చాలీసా పాటకు అనుసంధానంగా రిథమిక్ ఫైర్ శైలిలో యోగాసనాలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. సుమారు 2 నిమిషాలు 50 సెకన్ల పాటు సాగిన ఈ ప్రదర్శనకు జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతి లభించింది.
ఈ సందర్భంగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు రమేష్ ప్రతిభను కొనియాడుతూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో యోగా గురువు ముదిగొండ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.