శంషాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. బైకును ఢీకొట్టిన కారు గాల్లోకి ఎగిరిపడి మహిళ మృతి.. సీసీటీవీలో ప్రమాద దృశ్యాలు
శంషాబాద్: కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో చోటుచేసుకుంది. విమానాశ్రయంలో పనిచేస్తున్న రాధిక తన స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బైకును బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదం ధాటికి రాధిక బైక్పై నుంచి గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడిపోయింది. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెతో పాటు ప్రయాణిస్తున్న స్నేహితుడికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారును నడిపిన వ్యక్తిని ఉమాకాంత్గా గుర్తించిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు.