BREAKING
తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ
Date of Publish : 30 August 2026, 10:26 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

శ్రావణ శనివారం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక సేవలు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
30 Aug, 2026 - 10:26 AM
6 వీక్షణలు

100 కిలోల పులిహోర, రూ.15 వేల విలువైన స్టీల్ సామగ్రి సమర్పణ

అన్నమయ్య జిల్లా | పుంగనూరు | Ntoday News

పుంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ శనివారాన్ని పురస్కరించుకుని మూడో శనివారం ప్రత్యేక సేవా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రావణ శనివారం కావడంతో ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు, సులోచన, నమ్రత, శ్రీలక్ష్మీకాంత్ స్వామివారి సేవా కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందించారు. భక్తులకు ప్రసాద వితరణ కోసం 100 కిలోల పులిహోరను అందించడంతో పాటు, సుమారు రూ.15 వేల విలువైన స్టీల్ సామగ్రిని ఆలయ సేవకు సమర్పించారు.

దాతలు అందించిన సహకారంతో భక్తులకు ప్రసాద వితరణ నిర్వహించినట్లు ఆలయ టెంపుల్ ఇన్‌స్పెక్టర్ యశ్వంత్ తెలిపారు. స్వామివారి సేవా కార్యక్రమాలకు భక్తులు, దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది, భద్రతా సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. భక్తులు క్రమపద్ధతిలో స్వామివారిని దర్శించుకునేలా చర్యలు తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు శ్రీనివాసులు, చంగయ్య, సెక్యూరిటీ సిబ్బంది నరసింహులు తదితరులు పాల్గొన్నారు. స్వామివారి సేవకు సహకరించిన దాతలను ఆలయ అధికారులు అభినందించారు.