www.ntodaynews.com
శ్రీకాకుళం జిల్లాలో బీర్ల అమ్మకాల్లో రికార్డు స్థాయి పెరుగుదల
ఆంధ్రప్రదేశ్
/
శ్రీకాకుళం
ఎక్సైజ్ శాఖకు రూ.64 కోట్లకు పైగా ఆదాయం
శ్రీకాకుళం :
ఈ వేసవిలో శ్రీకాకుళం జిల్లాలో బీర్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఎక్సైజ్ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఏప్రిల్ 1 నుంచి జూన్ 10 వరకు సుమారు 3 లక్షల కేసుల బీర్లు విక్రయమయ్యాయి.
దీని ద్వారా ఎక్సైజ్ శాఖకు రూ.64.74 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ముఖ్యంగా మే నెలలో ఎండల తీవ్రత పెరగడంతో 1,50,022 కేసుల బీర్లు అమ్ముడైనట్లు అధికారులు తెలిపారు.