శ్రీశైలం ఘాట్ రోడ్డు 'దెయ్యాల మలుపు' వద్ద ప్రమాదాల నివారణకు పోలీసుల చర్యలు
శ్రీశైలం ఘాట్ రోడ్డు 'దెయ్యాల మలుపు' వద్ద ప్రమాదాల నివారణకు పోలీసుల చర్యలు: ఇన్వర్టెడ్ మిర్రర్ ఏర్పాటు
దోర్నాల, మార్చి 21: శ్రీశైలం ఘాట్ రోడ్డులోని అత్యంత ప్రమాదకరమైన బ్లాక్స్పాట్గా పేరొందిన ‘దెయ్యాల మలుపు’ వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు దోర్నాల పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ మలుపు వద్ద ప్రమాదాలను అరికట్టేందుకు వైపాలెం సి.ఐ మరియు దోర్నాల పోలీస్ స్టేషన్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు.
ఈ మలుపు వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు డ్రైవర్లకు స్పష్టంగా కనిపించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిని గమనించిన అధికారులు, మలుపు వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు ముందే కనిపించేలా ఇన్వర్టెడ్ మిర్రర్ (Inverted Mirror) ను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. "ఈ మిర్రర్ ఏర్పాటు వల్ల డ్రైవర్లు ముందస్తుగా అప్రమత్తమై, ఎదురెదురు ఢీకొనే ప్రమాదాలను (Head-on collisions) నివారించవచ్చు. ప్రజల ప్రాణ రక్షణే పోలీసుల ప్రధాన కర్తవ్యం. ఘాట్ రోడ్డులోని ఇతర ప్రమాదకర ప్రాంతాల్లో కూడా త్వరలో మరిన్ని భద్రతా చర్యలు చేపడతాం" అని పేర్కొన్నారు. ఘాట్ రోడ్డులో ప్రయాణించే వాహనదారులు వేగ నియంత్రణ పాటిస్తూ, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా అనుసరించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.