BREAKING
ఇంటింటికీ కూటమి జెండా.. ఈ-సైకిల్‌పై చంద్రబాబు ప్రచారం! మత్తుకు దూరంగా ఉండండి.. భవిష్యత్తును కాపాడుకోండి ప్రభుత్వ ఉపాధ్యాయులంతా టెట్ పాస్ కావాల్సిందే: సుప్రీంకోర్టు వ్యవసాయ బావిలో గుర్తుతెలియని మహిళా మృతదేహం చర్లపల్లి జైలు నుంచి అర్హత సాధించిన ఖైదీల విడుదల తాడిపత్రి రుద్రభూమి అభివృద్ధి పనుల పరిశీలన వివాహిత కుమార్తెలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు సుప్రీంకోర్టులో నేడు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం తెలంగాణకు వర్ష సూచన.. రానున్న 4 రోజుల్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు ఉద్యమకారుల గుర్తింపుపై త్వరగా విధివిధానాలు ప్రకటించాలి ఇంటింటికీ కూటమి జెండా.. ఈ-సైకిల్‌పై చంద్రబాబు ప్రచారం! మత్తుకు దూరంగా ఉండండి.. భవిష్యత్తును కాపాడుకోండి ప్రభుత్వ ఉపాధ్యాయులంతా టెట్ పాస్ కావాల్సిందే: సుప్రీంకోర్టు వ్యవసాయ బావిలో గుర్తుతెలియని మహిళా మృతదేహం చర్లపల్లి జైలు నుంచి అర్హత సాధించిన ఖైదీల విడుదల తాడిపత్రి రుద్రభూమి అభివృద్ధి పనుల పరిశీలన వివాహిత కుమార్తెలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు సుప్రీంకోర్టులో నేడు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం తెలంగాణకు వర్ష సూచన.. రానున్న 4 రోజుల్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు ఉద్యమకారుల గుర్తింపుపై త్వరగా విధివిధానాలు ప్రకటించాలి
www.ntodaynews.com

షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి: కొల్లూరి సుధారాణి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 03:39 PM
14 వీక్షణలు

ఏలూరులో భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) 72వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. 16వ డివిజన్ శాఖ కార్యదర్శి ఉప్పులూరి లక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ పతాకాన్ని ఏలూరు ఏరియా సహాయ కార్యదర్శి కొల్లూరి సుధారాణి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కొల్లూరి సుధారాణి మాట్లాడుతూ మహిళల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు నిర్వహించిందని తెలిపారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం జాతీయ స్థాయిలో పోరాటం చేసిన సంస్థగా ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూను కొనియాడారు. పోరాటాల ద్వారా సాధించిన మహిళా రిజర్వేషన్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఏలూరు ఏరియా ఉపాధ్యక్షురాలు గొర్లి స్వాతి మాట్లాడుతూ దేశంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను మరింత పటిష్టంగా అమలు చేయాలని కోరారు.

ఈ సమావేశంలో ఉప్పులూరి భవాని, రాజామణి, జ్యోతి, తాళ్లూరి సురేఖ, లక్కపాము ఝాన్సీ, పల్లిపాము సింధు, ఆలూరి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.