BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి: కొల్లూరి సుధారాణి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 03:39 PM
61 వీక్షణలు

ఏలూరులో భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) 72వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. 16వ డివిజన్ శాఖ కార్యదర్శి ఉప్పులూరి లక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ పతాకాన్ని ఏలూరు ఏరియా సహాయ కార్యదర్శి కొల్లూరి సుధారాణి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కొల్లూరి సుధారాణి మాట్లాడుతూ మహిళల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు నిర్వహించిందని తెలిపారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం జాతీయ స్థాయిలో పోరాటం చేసిన సంస్థగా ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూను కొనియాడారు. పోరాటాల ద్వారా సాధించిన మహిళా రిజర్వేషన్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఏలూరు ఏరియా ఉపాధ్యక్షురాలు గొర్లి స్వాతి మాట్లాడుతూ దేశంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను మరింత పటిష్టంగా అమలు చేయాలని కోరారు.

ఈ సమావేశంలో ఉప్పులూరి భవాని, రాజామణి, జ్యోతి, తాళ్లూరి సురేఖ, లక్కపాము ఝాన్సీ, పల్లిపాము సింధు, ఆలూరి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.