BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

సుబ్రహ్మణ్యస్వామికి విశేష అభిషేకం

తెలంగాణ
23 Feb, 2026 - 09:30 AM
241 వీక్షణలు
షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్యస్వామికి విశేష అభిషేకం NTODAY NEWS: శ్రీశైలం,నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున షష్ఠి తిథిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి సోమవారం ఉదయం విశేష అభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి మంగళవారం, కృత్తికా నక్షత్రం మరియు షష్ఠి తిథి రోజుల్లో ఈ విశేష అభిషేకాలు దేవస్థానం సేవగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అభిషేకానికి ముందు దేశం శాంతి, సౌభాగ్యాలతో వర్ధిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో వర్షాలు కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని అర్చకులు సంకల్పం పఠించారు. ప్రజలకు ఆయురారోగ్యాలు కలగాలని, అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు జరగకుండా ఉండాలని ప్రార్థనలు చేశారు. తదనంతరం మహాగణపతి పూజ నిర్వహించి, సుబ్రహ్మణ్యస్వామికి పంచామృతాలతో అభిషేకం చేశారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు మరియు వివిధ పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అర్చన, స్తోత్ర పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమం దేవస్థానం అధికారుల పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా జరిగింది. #Srisailam #SubrahmanyaSwamy #TempleNews #ReligiousNews #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube