BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

సుబ్రహ్మణ్యస్వామికి విశేష అభిషేకం

తెలంగాణ
23 Feb, 2026 - 09:30 AM
334 వీక్షణలు
షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్యస్వామికి విశేష అభిషేకం NTODAY NEWS: శ్రీశైలం,నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున షష్ఠి తిథిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి సోమవారం ఉదయం విశేష అభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి మంగళవారం, కృత్తికా నక్షత్రం మరియు షష్ఠి తిథి రోజుల్లో ఈ విశేష అభిషేకాలు దేవస్థానం సేవగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అభిషేకానికి ముందు దేశం శాంతి, సౌభాగ్యాలతో వర్ధిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో వర్షాలు కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని అర్చకులు సంకల్పం పఠించారు. ప్రజలకు ఆయురారోగ్యాలు కలగాలని, అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు జరగకుండా ఉండాలని ప్రార్థనలు చేశారు. తదనంతరం మహాగణపతి పూజ నిర్వహించి, సుబ్రహ్మణ్యస్వామికి పంచామృతాలతో అభిషేకం చేశారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు మరియు వివిధ పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అర్చన, స్తోత్ర పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమం దేవస్థానం అధికారుల పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా జరిగింది. #Srisailam #SubrahmanyaSwamy #TempleNews #ReligiousNews #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube