BREAKING
ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం బేడా బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలి చనుబండలో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ​మంచిర్యాల నూతన ఏసీగా రాజు బాధ్యతల స్వీకరణ సూరంపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా పెన్షన్‌ల పంపిణీ డయేరియా నివారణకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు మోసపూరిత మద్దతు ధరలపై రైతు సంఘం ఆందోళన పాడి రైతుల అభివృద్ధే లక్ష్యం కీసర పోలీస్ స్టేషన్‌కు సీపీ సుమతి ​మంచిర్యాల డీఈఓ యాదయ్య బదిలీ ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం బేడా బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలి చనుబండలో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ​మంచిర్యాల నూతన ఏసీగా రాజు బాధ్యతల స్వీకరణ సూరంపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా పెన్షన్‌ల పంపిణీ డయేరియా నివారణకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు మోసపూరిత మద్దతు ధరలపై రైతు సంఘం ఆందోళన పాడి రైతుల అభివృద్ధే లక్ష్యం కీసర పోలీస్ స్టేషన్‌కు సీపీ సుమతి ​మంచిర్యాల డీఈఓ యాదయ్య బదిలీ
www.ntodaynews.com

సుబ్రహ్మణ్యస్వామికి విశేష అభిషేకం

తెలంగాణ
23 Feb, 2026 - 09:30 AM
277 వీక్షణలు
షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్యస్వామికి విశేష అభిషేకం NTODAY NEWS: శ్రీశైలం,నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున షష్ఠి తిథిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి సోమవారం ఉదయం విశేష అభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి మంగళవారం, కృత్తికా నక్షత్రం మరియు షష్ఠి తిథి రోజుల్లో ఈ విశేష అభిషేకాలు దేవస్థానం సేవగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అభిషేకానికి ముందు దేశం శాంతి, సౌభాగ్యాలతో వర్ధిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో వర్షాలు కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని అర్చకులు సంకల్పం పఠించారు. ప్రజలకు ఆయురారోగ్యాలు కలగాలని, అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు జరగకుండా ఉండాలని ప్రార్థనలు చేశారు. తదనంతరం మహాగణపతి పూజ నిర్వహించి, సుబ్రహ్మణ్యస్వామికి పంచామృతాలతో అభిషేకం చేశారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు మరియు వివిధ పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అర్చన, స్తోత్ర పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమం దేవస్థానం అధికారుల పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా జరిగింది. #Srisailam #SubrahmanyaSwamy #TempleNews #ReligiousNews #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube