BREAKING
ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం బేడా బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలి చనుబండలో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ​మంచిర్యాల నూతన ఏసీగా రాజు బాధ్యతల స్వీకరణ సూరంపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా పెన్షన్‌ల పంపిణీ డయేరియా నివారణకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు మోసపూరిత మద్దతు ధరలపై రైతు సంఘం ఆందోళన పాడి రైతుల అభివృద్ధే లక్ష్యం కీసర పోలీస్ స్టేషన్‌కు సీపీ సుమతి ​మంచిర్యాల డీఈఓ యాదయ్య బదిలీ ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం బేడా బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలి చనుబండలో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ​మంచిర్యాల నూతన ఏసీగా రాజు బాధ్యతల స్వీకరణ సూరంపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా పెన్షన్‌ల పంపిణీ డయేరియా నివారణకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు మోసపూరిత మద్దతు ధరలపై రైతు సంఘం ఆందోళన పాడి రైతుల అభివృద్ధే లక్ష్యం కీసర పోలీస్ స్టేషన్‌కు సీపీ సుమతి ​మంచిర్యాల డీఈఓ యాదయ్య బదిలీ
www.ntodaynews.com

శ్రావణమాసం దుర్గ గుడిలో ప్రత్యేక కుంకుమార్చన పూజలు

తెలంగాణ
25 Jul, 2025 - 05:51 AM
145 వీక్షణలు
శ్రావణమాసం దుర్గ గుడిలో ప్రత్యేక కుంకుమార్చన పూజలు NTODAY NEWS: విజయవాడ దుర్గ గుడి, జులై 25. తొలిసారిగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కుంకుమార్చనలు. భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టిన ఈవో శీనా నాయక్. తొలి శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు. అమ్మవారి ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. కుంకుమార్చన పూజలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.కుంకుమార్చన పూజలు ప్రతి గంటకు ఒక బ్యాచ్ చొప్పున సాయంత్రం ఐదు గంటల వరకు భక్తులందరికీ కుంకుమార్చన పూజలో పాల్గొనే విధంగా చర్యలు. తొలి శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారి ఆలయంలో విశేష పూజలు ప్రత్యేక అలంకరణ. తొలిసారిగా అమ్మవారి ఆలయంలో సాయంత్రం ఐదు గంటల వరకు కుంకుమ పూజ చేసుకునే అవకాశం కల్పించిన ఈవో శీనా నాయక్. శ్రావణమాసం తొలి శుక్రవారం రోజున శ్రీ అమ్మవారి ఆలయాన్ని ప్రత్యేక పూల అలంకరణలో సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ ప్రాకారగోపురం లో శుక్రవారం ఉదయం నుంచి కొనసాగుతున్న ప్రత్యేక కుంకుమార్చనలు పూజలు. శ్రావణ మాసంలో శ్రీ దుర్గా దేవికి కుంకుమపూజ ప్రీతికరం.శ్రావణమాసములో కుంకుమ పూజలతో పూజించడం అనేది ఒక సంప్రదాయం. కుంకుమ పూజతొ పూజించడం వల్ల భక్తుల కష్టాలు తొలగి, సిరిసంపదలు చేకూరుతాయని ప్రతీతి. శ్రావణమాసం ప్రతీ రోజు ఉదయం 10 గంటలనుండి సాయంత్రం 5 గంటల వరకు, ఒక గంటకు ఒక బ్యాచ్ చొప్పున ప్రత్యేక కుంకుమార్చనలు ఉభయ రుసుము రూ.1,000/- లపై పూజకు ఇరువురు పాల్గొనవచ్చును. శ్రావణమాసంలో దుర్గా దేవిని పూజించడం వల్ల, కష్టాలు తొలగి, సిరిసంపదలతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. శ్రావణ శుక్రవారం రోజున భక్తులకు చక్కని దర్శనం లభించినది. క్యూలైన్లు అన్నియు భక్తులతో ప్రశాంతంగా ఏర్పాటు చేయడమైనది. సాంకేతికత చర్యలు వినియోగించుకుంటూ సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేసిన కార్యనిర్వాహణాధికారి శీనా నాయక్. శ్రావణమాసం లో భక్తులు ఈ కుంకుమ పూజలు అవకాశమును వినియోగించుకోవచ్చును. శ్రావణమాసం దేవస్థాన సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించడమైనది. తొలి శ్రావణ శుక్రవారం రోజున భక్తులకు చక్కని దర్శనం లభించినది. భక్తులకు ప్రసాదాలు అందజేస్తున్నారు. Follow us on Website Facebook Instagram YouTube