BREAKING
విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా
www.ntodaynews.com

శ్రావణమాసం దుర్గ గుడిలో ప్రత్యేక కుంకుమార్చన పూజలు

తెలంగాణ
25 Jul, 2025 - 05:51 AM
107 వీక్షణలు
శ్రావణమాసం దుర్గ గుడిలో ప్రత్యేక కుంకుమార్చన పూజలు NTODAY NEWS: విజయవాడ దుర్గ గుడి, జులై 25. తొలిసారిగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కుంకుమార్చనలు. భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టిన ఈవో శీనా నాయక్. తొలి శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు. అమ్మవారి ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. కుంకుమార్చన పూజలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.కుంకుమార్చన పూజలు ప్రతి గంటకు ఒక బ్యాచ్ చొప్పున సాయంత్రం ఐదు గంటల వరకు భక్తులందరికీ కుంకుమార్చన పూజలో పాల్గొనే విధంగా చర్యలు. తొలి శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారి ఆలయంలో విశేష పూజలు ప్రత్యేక అలంకరణ. తొలిసారిగా అమ్మవారి ఆలయంలో సాయంత్రం ఐదు గంటల వరకు కుంకుమ పూజ చేసుకునే అవకాశం కల్పించిన ఈవో శీనా నాయక్. శ్రావణమాసం తొలి శుక్రవారం రోజున శ్రీ అమ్మవారి ఆలయాన్ని ప్రత్యేక పూల అలంకరణలో సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ ప్రాకారగోపురం లో శుక్రవారం ఉదయం నుంచి కొనసాగుతున్న ప్రత్యేక కుంకుమార్చనలు పూజలు. శ్రావణ మాసంలో శ్రీ దుర్గా దేవికి కుంకుమపూజ ప్రీతికరం.శ్రావణమాసములో కుంకుమ పూజలతో పూజించడం అనేది ఒక సంప్రదాయం. కుంకుమ పూజతొ పూజించడం వల్ల భక్తుల కష్టాలు తొలగి, సిరిసంపదలు చేకూరుతాయని ప్రతీతి. శ్రావణమాసం ప్రతీ రోజు ఉదయం 10 గంటలనుండి సాయంత్రం 5 గంటల వరకు, ఒక గంటకు ఒక బ్యాచ్ చొప్పున ప్రత్యేక కుంకుమార్చనలు ఉభయ రుసుము రూ.1,000/- లపై పూజకు ఇరువురు పాల్గొనవచ్చును. శ్రావణమాసంలో దుర్గా దేవిని పూజించడం వల్ల, కష్టాలు తొలగి, సిరిసంపదలతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. శ్రావణ శుక్రవారం రోజున భక్తులకు చక్కని దర్శనం లభించినది. క్యూలైన్లు అన్నియు భక్తులతో ప్రశాంతంగా ఏర్పాటు చేయడమైనది. సాంకేతికత చర్యలు వినియోగించుకుంటూ సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేసిన కార్యనిర్వాహణాధికారి శీనా నాయక్. శ్రావణమాసం లో భక్తులు ఈ కుంకుమ పూజలు అవకాశమును వినియోగించుకోవచ్చును. శ్రావణమాసం దేవస్థాన సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించడమైనది. తొలి శ్రావణ శుక్రవారం రోజున భక్తులకు చక్కని దర్శనం లభించినది. భక్తులకు ప్రసాదాలు అందజేస్తున్నారు. Follow us on Website Facebook Instagram YouTube