BREAKING
ఇంటి పనుల విషయంలో మందలించడంతో యువతి ఆత్మహత్య ఇంటింటికీ కూటమి జెండా.. ఈ-సైకిల్‌పై చంద్రబాబు ప్రచారం! మత్తుకు దూరంగా ఉండండి.. భవిష్యత్తును కాపాడుకోండి ప్రభుత్వ ఉపాధ్యాయులంతా టెట్ పాస్ కావాల్సిందే: సుప్రీంకోర్టు వ్యవసాయ బావిలో గుర్తుతెలియని మహిళా మృతదేహం చర్లపల్లి జైలు నుంచి అర్హత సాధించిన ఖైదీల విడుదల తాడిపత్రి రుద్రభూమి అభివృద్ధి పనుల పరిశీలన వివాహిత కుమార్తెలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు సుప్రీంకోర్టులో నేడు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం తెలంగాణకు వర్ష సూచన.. రానున్న 4 రోజుల్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు ఇంటి పనుల విషయంలో మందలించడంతో యువతి ఆత్మహత్య ఇంటింటికీ కూటమి జెండా.. ఈ-సైకిల్‌పై చంద్రబాబు ప్రచారం! మత్తుకు దూరంగా ఉండండి.. భవిష్యత్తును కాపాడుకోండి ప్రభుత్వ ఉపాధ్యాయులంతా టెట్ పాస్ కావాల్సిందే: సుప్రీంకోర్టు వ్యవసాయ బావిలో గుర్తుతెలియని మహిళా మృతదేహం చర్లపల్లి జైలు నుంచి అర్హత సాధించిన ఖైదీల విడుదల తాడిపత్రి రుద్రభూమి అభివృద్ధి పనుల పరిశీలన వివాహిత కుమార్తెలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు సుప్రీంకోర్టులో నేడు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం తెలంగాణకు వర్ష సూచన.. రానున్న 4 రోజుల్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు
www.ntodaynews.com

గ్రామాల్లో పులి సంచారంపై ప్రత్యేక చర్యలు

తెలంగాణ
03 Feb, 2026 - 04:15 AM
121 వీక్షణలు
గ్రామాల్లో పులి సంచారం: జిల్లా కలెక్టర్ ప్రత్యేక చర్యలు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లాలోని కొన్ని గ్రామాల పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. మంగళవారం రాజాపేట మండలం బసంతాపూర్ గ్రామంలో పులి దాడిలో లేగ దూడ మృతి చెందిన సంఘటన స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులతో సమావేశమై పులిని పట్టుకునేందుకు చేపడుతున్న చర్యలపై సమీక్షించారు. పులి పట్టుకునేందుకు చర్యలు పులి సంచారాన్ని గుర్తించేందుకు థర్మల్ డ్రోన్ ద్వారా వీడియో రికార్డింగ్, ట్రాప్ కెమెరాల ఏర్పాటు, పులిని బంధించేందుకు బోన్లను అమర్చినట్లు అటవీ శాఖ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. పులి అడుగుజాడలను నిరంతరం గమనిస్తూ దానిని అడవిలోకి మళ్లించే దిశగా చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. ప్రజలకు సూచనలు అడవి ప్రాంతాలకు ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లకూడదని, వ్యవసాయ పనుల కోసం వెళ్లేటప్పుడు గుంపులుగా వెళ్లాలని కలెక్టర్ సూచించారు. రాత్రివేళ పశువులను బయట వదలకుండా పశువుల పాకల్లో సరిపడా వెలుతురు ఉండేలా చూసుకోవాలని తెలిపారు. పులి కనిపించినట్లు గమనించిన వెంటనే అటవీ శాఖ అధికారులు లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని, దానికి సమీపానికి వెళ్లే ప్రయత్నం చేయరాదని హెచ్చరించారు. ప్రజలు భయాందోళనకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫారెస్ట్ అధికారి, రెవెన్యూ అధికారులు మరియు సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube