BREAKING
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు!
Date of Publish : 03 February 2026, 04:15 am
Posted by : NTODAY NEWS OFFICIAL

గ్రామాల్లో పులి సంచారంపై ప్రత్యేక చర్యలు

తెలంగాణ
03 Feb, 2026 - 04:15 AM
209 వీక్షణలు
గ్రామాల్లో పులి సంచారం: జిల్లా కలెక్టర్ ప్రత్యేక చర్యలు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లాలోని కొన్ని గ్రామాల పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. మంగళవారం రాజాపేట మండలం బసంతాపూర్ గ్రామంలో పులి దాడిలో లేగ దూడ మృతి చెందిన సంఘటన స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులతో సమావేశమై పులిని పట్టుకునేందుకు చేపడుతున్న చర్యలపై సమీక్షించారు. పులి పట్టుకునేందుకు చర్యలు పులి సంచారాన్ని గుర్తించేందుకు థర్మల్ డ్రోన్ ద్వారా వీడియో రికార్డింగ్, ట్రాప్ కెమెరాల ఏర్పాటు, పులిని బంధించేందుకు బోన్లను అమర్చినట్లు అటవీ శాఖ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. పులి అడుగుజాడలను నిరంతరం గమనిస్తూ దానిని అడవిలోకి మళ్లించే దిశగా చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. ప్రజలకు సూచనలు అడవి ప్రాంతాలకు ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లకూడదని, వ్యవసాయ పనుల కోసం వెళ్లేటప్పుడు గుంపులుగా వెళ్లాలని కలెక్టర్ సూచించారు. రాత్రివేళ పశువులను బయట వదలకుండా పశువుల పాకల్లో సరిపడా వెలుతురు ఉండేలా చూసుకోవాలని తెలిపారు. పులి కనిపించినట్లు గమనించిన వెంటనే అటవీ శాఖ అధికారులు లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని, దానికి సమీపానికి వెళ్లే ప్రయత్నం చేయరాదని హెచ్చరించారు. ప్రజలు భయాందోళనకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫారెస్ట్ అధికారి, రెవెన్యూ అధికారులు మరియు సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube