BREAKING
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు!
Date of Publish : 09 March 2026, 02:12 am
Posted by : NTODAY NEWS OFFICIAL

శ్రీశైలం ఆలయాన్ని సందర్శించిన శృంగేరి పీఠాధిపతి

తెలంగాణ
09 Mar, 2026 - 02:12 AM
231 వీక్షణలు
శ్రీశైలం ఆలయాన్ని సందర్శించిన శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతీ మహాస్వామి NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున శృంగేరి శారదాపీఠం ఉత్తరాధికారి జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి శ్రీశైలం ఆలయాన్ని సందర్శించి స్వామి, అమ్మవార్లను సేవించారు. ఉదయం ఆలయానికి చేరుకున్న మహాస్వామికి సంప్రదాయం ప్రకారం రాజగోపురం వద్ద కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు చిట్టిబొట్ల భరద్వాజశర్మ, అర్చకులు, వేదపండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మహాస్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. తదుపరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో మహాస్వామి గౌరవార్థం వేదగోష్ఠి నిర్వహించారు. అనంతరం గురువందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహాస్వామి అనుగ్రహ భాషణం చేస్తూ సనాతన ధర్మ విశిష్టత, శ్రీశైల క్షేత్ర మహిమ, శివానందలహరి మరియు సౌందర్యలహరి స్తోత్రాల ప్రాముఖ్యత గురించి వివరించారు. చివరగా భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు. #Srisailam #SringeriPeetham #VidhushekharaBharathi #TempleVisit #SpiritualNews #AndhraPradeshNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube