BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

శ్రీశైలం ఆలయాన్ని సందర్శించిన శృంగేరి పీఠాధిపతి

తెలంగాణ
09 Mar, 2026 - 02:12 AM
177 వీక్షణలు
శ్రీశైలం ఆలయాన్ని సందర్శించిన శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతీ మహాస్వామి NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున శృంగేరి శారదాపీఠం ఉత్తరాధికారి జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి శ్రీశైలం ఆలయాన్ని సందర్శించి స్వామి, అమ్మవార్లను సేవించారు. ఉదయం ఆలయానికి చేరుకున్న మహాస్వామికి సంప్రదాయం ప్రకారం రాజగోపురం వద్ద కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు చిట్టిబొట్ల భరద్వాజశర్మ, అర్చకులు, వేదపండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మహాస్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. తదుపరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో మహాస్వామి గౌరవార్థం వేదగోష్ఠి నిర్వహించారు. అనంతరం గురువందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహాస్వామి అనుగ్రహ భాషణం చేస్తూ సనాతన ధర్మ విశిష్టత, శ్రీశైల క్షేత్ర మహిమ, శివానందలహరి మరియు సౌందర్యలహరి స్తోత్రాల ప్రాముఖ్యత గురించి వివరించారు. చివరగా భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు. #Srisailam #SringeriPeetham #VidhushekharaBharathi #TempleVisit #SpiritualNews #AndhraPradeshNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube