www.ntodaynews.com
సభ్యత్వ నమోదు సమావేశంలో రాష్ట్ర నాయకులు
తెలంగాణ
ఉద్యమి సభ్యత్వ నమోదు సమావేశంలో రాష్ట్ర నాయకుల పాల్గొనిక
NTODAY NEWS: పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్రరాజు
పుంగనూరు పట్టణంలోని ట్రావెల్స్ బంగ్లాలో నిర్వహించిన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమానికి రాజంపేట పార్లమెంట్ ఇన్చార్జ్, జనసేన పార్టీ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ మరియు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శ్రీనివాస్, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు మరియు రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, రాజంపేట పార్లమెంట్ పరిశీలకుడు అధికారి కృష్ణ హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉద్యమి సభ్యత్వం పొందిన వారికి ప్రమాద బీమా సదుపాయం ఉంటుందని తెలిపారు. సభ్యత్వం కలిగిన వ్యక్తికి ప్రమాదం జరిగితే రూ.50,000 వరకు, మరణం సంభవించిన పక్షంలో కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల వరకు బీమా అందుతుందని వివరించారు. పార్టీ సిద్ధాంతాలు, నాయకత్వంపై విశ్వాసంతో కార్యకర్తలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో పుంగనూరు నియోజకవర్గాన్ని ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మొదటి స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పీఓసీ చిన్న రాయల్, పుంగనూరు డీసీసీబీ చైర్మన్ పగడాల రమణ, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రోగ్రాం సెక్రటరీ చైతన్య రాయల్, నియోజకవర్గ నాయకులు సోమశేఖర్, మండల రూరల్ అధ్యక్షుడు విరుపాక్షి, పట్టణ అధ్యక్షుడు నరేష్ రాయల్, పాముల హరి, బాలాజీ నాయక్, హరి నాయక్, భీమగానిపల్లి జనార్దన్ రాయల్, కిషోర్ రాయల్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
#Punganur #Janasena #MembershipDrive #AndhraPradeshPolitics #PartyMeeting
Follow us on
Website
Facebook
Instagram
YouTube