BREAKING
నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం..
Date of Publish : 26 February 2026, 07:54 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

సభ్యత్వ నమోదు సమావేశంలో రాష్ట్ర నాయకులు

తెలంగాణ
26 Feb, 2026 - 07:54 PM
369 వీక్షణలు
ఉద్యమి సభ్యత్వ నమోదు సమావేశంలో రాష్ట్ర నాయకుల పాల్గొనిక NTODAY NEWS: పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్రరాజు పుంగనూరు పట్టణంలోని ట్రావెల్స్ బంగ్లాలో నిర్వహించిన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమానికి రాజంపేట పార్లమెంట్ ఇన్‌చార్జ్, జనసేన పార్టీ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ మరియు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శ్రీనివాస్, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు మరియు రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, రాజంపేట పార్లమెంట్ పరిశీలకుడు అధికారి కృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉద్యమి సభ్యత్వం పొందిన వారికి ప్రమాద బీమా సదుపాయం ఉంటుందని తెలిపారు. సభ్యత్వం కలిగిన వ్యక్తికి ప్రమాదం జరిగితే రూ.50,000 వరకు, మరణం సంభవించిన పక్షంలో కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల వరకు బీమా అందుతుందని వివరించారు. పార్టీ సిద్ధాంతాలు, నాయకత్వంపై విశ్వాసంతో కార్యకర్తలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పుంగనూరు నియోజకవర్గాన్ని ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మొదటి స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పీఓసీ చిన్న రాయల్, పుంగనూరు డీసీసీబీ చైర్మన్ పగడాల రమణ, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రోగ్రాం సెక్రటరీ చైతన్య రాయల్, నియోజకవర్గ నాయకులు సోమశేఖర్, మండల రూరల్ అధ్యక్షుడు విరుపాక్షి, పట్టణ అధ్యక్షుడు నరేష్ రాయల్, పాముల హరి, బాలాజీ నాయక్, హరి నాయక్, భీమగానిపల్లి జనార్దన్ రాయల్, కిషోర్ రాయల్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. #Punganur #Janasena #MembershipDrive #AndhraPradeshPolitics #PartyMeeting Follow us on Website Facebook Instagram YouTube