BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

మున్సిపల్ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

తెలంగాణ
06 Feb, 2026 - 08:34 PM
338 వీక్షణలు
ఓటర్లను ప్రలోభాల నుండి అడ్డుకోవాలి మున్సిపల్ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు: రాణి కుముదిని NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకుండా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్ జిల్లాలకు చెందిన జనరల్ అబ్జర్వర్లు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఏడీజీపీ మహేష్ భగవత్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాణి కుముదిని మాట్లాడుతూ, ఎన్నికలు పూర్తిగా నిష్పక్షపాతంగా జరగాలని, ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా అన్ని స్థాయిల్లో పర్యవేక్షణ ఉండాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ఏడీజీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో అక్రమ మద్యం, నగదు పంపిణీ, ప్రలోభాలకు ఉపయోగించే సామగ్రిపై ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలతో నిరంతర నిఘా కొనసాగించాలని తెలిపారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు, రౌడీషీట్ నమోదైన వ్యక్తులపై పోలింగ్ రోజున ప్రత్యేక షాడో టీమ్‌లతో నిఘా పెట్టాలని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్, ఎన్నికల పరిశీలకులు గౌతమి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ, జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో 104 వార్డులకు గాను 212 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలను సాఫీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. జిల్లా ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్ మాట్లాడుతూ, సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని, ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. #MunicipalElections #FreeAndFairElections #ElectionCommission #NoVoterInducement #TelanganaElections #YadadriBhuvanagiri #NtodayNews Follow us on Website Facebook Instagram YouTube