www.ntodaynews.com
విద్యార్థులు భాగస్వాములు కావాలి
తెలంగాణ
సామాజిక బాధ్యతల పట్ల విద్యార్థులు భాగస్వాములు కావాలి
ఆహార పంటల పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం
NTODAY NEWS: చిట్యాల
సామాజిక బాధ్యతల పట్ల విద్యార్థులు చైతన్యంతో భాగస్వాములు కావాలని చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్ పేర్కొన్నారు. శనివారం చిట్యాల పట్టణంలోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో నిర్వహించిన ఆహార పంటల పోటీల విజేతలకు బహుమతుల ప్రదాన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యతో పాటు విద్యార్థులలోని ప్రతిభ, నైపుణ్యాలను వెలికితీయడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని అన్నారు. ఆటలు, పాటలు, కళలు మరియు సామాజిక కార్యక్రమాల్లో విద్యార్థులు చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించాలని సూచించారు.
ప్రతి విద్యార్థి అభిరుచిని గుర్తించి, ఆయా రంగాల్లో వారు ఉన్నత స్థాయికి చేరేలా మార్గనిర్దేశం చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దేశపాక లతా రాజేష్, పాఠశాల ప్రతినిధులు పెద్ది నరేందర్, ఆనంద్ కుమార్, పెద్ది పద్మ, షేక్ షామిమ్, ధనలక్ష్మి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
#Chityal #Education #StudentDevelopment #SocialResponsibility #SchoolEvents #TelanganaNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube